ట్రంప్‌కు ఎదురుదెబ్బ.. టాటా కంపెనీ అమెరికాకు కార్లను ఎగుమతి నిలిపివేత!

ట్రంప్‌కు ఎదురుదెబ్బ.. టాటా కంపెనీ అమెరికాకు కార్ల ఎగుమతి నిలిపివేత!

07 April 2025

image

Subhash

అధ్యక్షుడైన తర్వాత ట్రంప్ తన సుంకాల ప్రకటనను నిజం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలపై సుంకాలను ప్రకటించాడు. కానీ ట్రంప్‌కు ఇప్పుడు ఎదురుదెబ్బ తగలబోతోందని తెలుస్తోంది.

అధ్యక్షుడైన తర్వాత ట్రంప్ తన సుంకాల ప్రకటనను నిజం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలపై సుంకాలను ప్రకటించాడు. కానీ ట్రంప్‌కు ఇప్పుడు ఎదురుదెబ్బ తగలబోతోందని తెలుస్తోంది.

సుంకాలు

డోనాల్డ్ ట్రంప్ ఆటో రంగంపై 25% సుంకాన్ని ప్రకటించారు. ఇంతలో టాటా కంపెనీ తన వాహనాన్ని అమెరికాకు సరఫరాపై కీలక నిర్ణయం తీసుకుంది.

డోనాల్డ్ ట్రంప్ ఆటో రంగంపై 25% సుంకాన్ని ప్రకటించారు. ఇంతలో టాటా కంపెనీ తన వాహనాన్ని అమెరికాకు సరఫరాపై కీలక నిర్ణయం తీసుకుంది.

ఆటో రంగం

టాటా మోటార్స్ అనుబంధ సంస్థ అయిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇలాంటి నిర్ణయం తీసుకుంది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ బ్రిటన్‌లో తయారైన వాహనాలను అమెరికాకు ఎగుమతి చేయడాన్ని నిలిపివేసింది.

టాటా మోటార్స్ అనుబంధ సంస్థ అయిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇలాంటి నిర్ణయం తీసుకుంది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ బ్రిటన్‌లో తయారైన వాహనాలను అమెరికాకు ఎగుమతి చేయడాన్ని నిలిపివేసింది. 

టాటా మోటార్స్

బ్రిటన్‌లోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం సోమవారం నుండి అమల్లోకి వస్తుంది. ఆటో రంగంపై అమెరికా ప్రభుత్వం విధించిన 25 శాతం సుంకం గురువారం నుంచి అమల్లోకి వస్తుంది. 

బ్రిటన్‌

టాటా మోటార్స్ యాజమాన్యంలోని కంపెనీ ఈ నిర్ణయం ట్రంప్ సుంకాలను నివారించడానికి ఒక మార్గంగా భావిస్తున్నారు. జాగ్వార్ ల్యాండ్ రోవర్ అనేది UKలో 38,000 మందికి ఉపాధి కల్పించే సంస్థ. 

 ట్రంప్ 

టాటా మోటార్స్ యాజమాన్యంలోని యూనిట్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) సుంకం నిర్మాణంలో మార్పుల దృష్ట్యా UKలోని దాని తయారీ ప్లాంట్ల నుండి USకి వాహనాల ఎగుమతిని నిలిపివేసింది. 

టాటా మోటార్స్

జాగ్వార్ ల్యాండ్ రోవర్ బ్రాండ్ US మార్కెట్లో బలమైన వ్యాపారాన్ని కలిగి ఉంది. FY24లో 4 లక్షలకు పైగా యూనిట్లలో దాదాపు 23 శాతం US మార్కెట్లో అమ్ముడయ్యాయి. 

జాగ్వార్ ల్యాండ్ రోవర్

మార్చి 2024 వరకు 12 నెలల్లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ 4,30,000 వాహనాలను విక్రయించిందని, వాటిలో దాదాపు నాల్గో వంతు ఉత్తర అమెరికాలో ఉన్నాయని కంపెనీ తన వార్షిక నివేదికలో తెలిపింది.

జాగ్వార్