
బంగారం, వెండి మధ్య పోటీ శతాబ్దాలుగా కొనసాగుతున్నప్పటికీ, ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు వాటి ప్రాధాన్యతను మరింత పెంచాయి. యుద్ధ భయాలు, రాజకీయ అస్థిరత, స్టాక్ మార్కెట్లలో హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణం పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, తమ సంపాదనను సురక్షితంగా కాపాడుకుంటూ వృద్ధిని సాధించాలనే లక్ష్యంతో పెట్టుబడిదారులు బంగారం, వెండి వైపు చూస్తున్నారు. గోల్డ్ అండ్ సిల్వర్ ఫండ్ ఆఫ్ ఫండ్స్(ఎఫ్ఓఎఫ్) ఇదొక మ్యూచువల్ ఫండ్ మోడల్. ఇందులో పెట్టుబడిదారులు భౌతికంగా బంగారం లేదా వెండిని కొనుగోలు చేయకుండా, బంగారు, వెండి ఈటీఎఫ్లలో పెట్టుబడి పెడతారు. సాధారణంగా ఈ ఎఫ్ఓఎఫ్లు బంగారం, వెండిని 50:50 నిష్పత్తిలో కేటాయించి, పోర్ట్ఫోలియోలో సమతుల్యతను తీసుకువస్తాయి.
బంగారం ఎప్పుడూ సేఫ్ హెవెన్గా ఉంటుంది, స్టాక్ మార్కెట్లు క్షీణించినప్పుడు లేదా కరెన్సీ విలువలు పడిపోయినప్పుడు బలంగా నిలుస్తుంది. వెండికి ఇండస్ట్రీ అవసరాల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది(సౌర విద్యుత్, ఎలక్ట్రిక్ వాహనాలు). ఆర్థిక పునరుద్ధరణ దశల్లో వెండి అధిక రాబడిని ఇవ్వగలదు, అయితే అధిక అస్థిరతకు లోబడి ఉంటుంది. ఎఫ్ఓఎఫ్ల ద్వారా ఈటీఎఫ్లలో పెట్టుబడి పెట్టడం వల్ల పారదర్శకత, ద్రవ్యత లభిస్తాయి. భౌతిక లోహాల కొనుగోలుకు సంబంధించిన నిల్వ సమస్యలు, స్వచ్ఛతపై అనుమానాలు, బీమా ఖర్చులు వంటి ఇబ్బందులు ఉండవు. ఆర్థిక నిపుణుల సూచనల ప్రకారం, మొత్తం పెట్టుబడి పోర్ట్ఫోలియోలో 10 నుంచి 15 శాతం వరకు విలువైన లోహాలకు కేటాయించడం సమతుల్య వ్యూహం అని అంటున్నారు.
ఇది చదవండి: నవ్వకండి ఇది సీరియస్ మ్యాటర్.! గుర్తుపెట్టుకోండి.. ఈసారి టీ20 వరల్డ్కప్ ఆస్ట్రేలియాదే
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి