Gold, Silver Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. అదే బాటలోనే వెండి.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

Gold Silver Price 8th March 2022: ఉక్రెయిన్‌-రష్యాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం (Ukraine russia issue) కారణంగా గత కొన్ని రోజులుగా పసిడి పరుగులు పెడుతోన్న సంగతి తెలిసిందే

Gold, Silver Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. అదే బాటలోనే వెండి.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..
Gold
Follow us

|

Updated on: Mar 08, 2022 | 7:36 AM

Gold Silver Price 8th March 2022: ఉక్రెయిన్‌-రష్యాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం (Ukraine russia issue) కారణంగా గత కొన్ని రోజులుగా పసిడి పరుగులు పెడుతోన్న సంగతి తెలిసిందే. వెండి కూడా అదే దారిలో నడుస్తోంది. నిన్న బంగారం, వెండి ధరలు కొద్దిగా తగ్గినా నేడు మళ్లీ పెరిగాయి. పసిడి ధర ఒక్క రోజులోనే రూ.1000కి పైగా ఎగబాకింది. ఇక నేను కూడా తగ్గేదేలే అన్నట్లు వెండి రేటు కూడా భారీగా పెరిగింది. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో మార్పులు లేవు. మరి దేశంలో ప్రధాన నగరాల్లో మంగళవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

*దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 49,400 గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 53,890 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 49,400పలుకుతుండగా, 24 క్యారెట్ల ధర రూ. 53,890గా ఉంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 50.710 గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 55, 320 వద్ద కొనసాగుతోంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 49,400 గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 53,890 వద్ద కొనసాగుతోంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి.. * హైదరాబాద్‌లోనూ బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు కనిపించలేవు. ఇక్కడ 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 49,400 గా పలుకుతుండగా, 24 క్యారెట్ల ధర రూ. 53,890 వద్ద ఉంది.

* విజయవాడలో మంగళవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,400 వద్ద ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 53,890 వద్ద కొనసాగుతోంది.

* ఇక విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 48,400 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 52,800 గా నమోదైంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

► ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 71,000 ఉంది.

► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 71,000 పలుకుతోంది.

► తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 75, 700 వద్ద కొనసాగుతోంది.

► కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 71,000 ఉంది.

► కేరళలో కిలో వెండి ధర 75,700 ఉంది.

► హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 75,700గా పలుకుతోంది.

► విజయవాడలో కిలో వెండి ధర రూ. 75,700గా ఉంది.

► విశాఖపట్నంలో సిల్వర్‌ రేట్‌ రూ. 75,700 ఉంది.

Also Read:Chicken Price Hike: మాంసం ప్రియులకు షాకింగ్ న్యూస్.. కోడి కొండెక్కింది.. చుక్కలనంటుతున్న చికెన్ రేట్..!

UPSC Mains 2021: కోవిడ్‌ వల్లనే పరీక్ష రాయలేకపోయం.. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షకు అదనపు అటెంప్ట్‌ కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్‌!

Horoscope Today: ఈరాశి వారు ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..