Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fake Hallmark: వినియోగదారులు అలర్ట్‌.. మార్కెట్లో నకిలీ హాల్‌మార్క్ బంగారం విక్రయాలు.. రంగంలోకి దిగిన కేంద్రం

ప్రపంచంలో బంగారం వినియోగంలో భారతదేశం రెండో స్థానంలో ఉంది. దేశంలో హాల్‌మార్క్ ఉన్న బంగారు ఆభరణాల విక్రయాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసినప్పటికీ, నకిలీ హాల్‌మార్క్ బంగారు..

Fake Hallmark: వినియోగదారులు అలర్ట్‌.. మార్కెట్లో నకిలీ హాల్‌మార్క్ బంగారం విక్రయాలు.. రంగంలోకి దిగిన కేంద్రం
Gold
Follow us
Subhash Goud

|

Updated on: Dec 29, 2022 | 5:47 PM

ప్రపంచంలో బంగారం వినియోగంలో భారతదేశం రెండో స్థానంలో ఉంది. దేశంలో హాల్‌మార్క్ ఉన్న బంగారు ఆభరణాల విక్రయాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసినప్పటికీ, నకిలీ హాల్‌మార్క్ బంగారు ఆభరణాలు ఇప్పటికీ మార్కెట్‌లో విచ్చలవిడిగా అమ్ముడవుతున్నాయి. దీంతో సామాన్యులకు నష్టం వాటిల్లుతోంది. రెండోది ప్రభుత్వానికి ఆదాయానికి గండి పడుతోంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ విషయమై మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ చైర్మన్ ఎం.పి.అహ్మద్ మాట్లాడుతూ.. నకిలీ హాల్‌మార్క్ నగలు గ్రాము రూ.200 నుంచి రూ.300 తక్కువ ధరకు మార్కెట్‌లో లభిస్తున్నాయని చెప్పారు. దీంతో సామాన్యుల దృష్టి కూడా అటువైపు వెళ్తోందని అన్నారు.

ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచడం వల్ల దేశంలో పెద్ద ఎత్తున బంగారం స్మగ్లింగ్ జరుగుతుంది. దీనిపై ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా ఆందోళన వ్యక్తం చేశారు. అటువంటి పరిస్థితిలో ఈ బంగారాన్ని నకిలీ హాల్‌మార్క్ ఆభరణాలలో ఉపయోగిస్తారు. చిల్లర దుకాణదారులకు కూడా తక్కువ ధరకే లభిస్తోంది.

మరోవైపు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ దేశంలో జూన్ 2021 నుంచే ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేసిందని ఎంపీ అహ్మద్ చెప్పారు. కానీ నకిలీ హాల్‌మార్క్ ఉన్న ఆభరణాలు స్మగ్లింగ్ చేసిన బంగారంతో తయారు చేస్తారు. ఇది న్యాయమైన, చట్టబద్ధమైన పద్ధతిలో వ్యాపారం చేసే నగల వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతుంది. వారికి మరింత నష్టం వాటిల్లుతోందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నకిలీ హాల్‌మార్క్ బంగారు ఆభరణాల మార్కెట్‌పై ప్రభుత్వం నిఘా ఉంచింది. అదే సమయంలో చాలా మంది దుకాణదారులు, హాల్‌మార్క్ ఫెడరేషన్, ఇతర మార్కెట్ సంస్థలు కూడా దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. ఇప్పుడు దీన్ని నిషేధించేలా నిబంధనలు తీసుకురావడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోంది.

నకిలీ హాల్‌మార్క్ బంగారు ఆభరణాలు, అందులో వినియోగిస్తున్న స్మగ్లింగ్ బంగారాన్ని విక్రయించడం వల్ల ప్రభుత్వం కోట్లాది రూపాయల ఆదాయాన్ని కోల్పోతోంది. అదే సమయంలో నకిలీ హాల్‌మార్కింగ్‌ను అరికట్టడానికి BIS కూడా అనేక నగరాల్లో దాడులు ప్రారంభించింది. అదే సమయంలో దీనిని నిర్ణయించడానికి ఆభరణాల వ్యాపారులు హాల్‌మార్కింగ్ లైసెన్స్ కలిగి ఉండటం తప్పనిసరి. ఇలా నకిలీ హాల్‌మార్కింగ్‌తో కూడిన బంగారం అభరణాలు మార్కెట్లోకి రావడంతో అధికారులు రంగంలోకి దిగి చర్యలు చేపడుతున్నారు. నకిలీ హాల్‌మార్కింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా పెడుతున్నారు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి