AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: ఈ వారంలో ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. ఆ ప్రకటన చేసే అవకాశం!

EPFO: ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి ఈపీఎఫ్‌వో​​పథకం అతిపెద్ద సామాజిక భద్రతా పథకంగా పరిగణిస్తారు. ప్రతి నెలా ప్రైవేట్ రంగ ఉద్యోగుల జీతం నుండి పీఎఫ్‌ పేరుతో కొంత మొత్తాన్ని కట్‌ అవుతుంటుంది. ఈ మొత్తాన్ని యజమాని పీఎఫ్‌కి జమ చేస్తారు. ఉద్యోగం కోల్పోవడం, భవనం నిర్మించడం..

EPFO: ఈ వారంలో ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. ఆ ప్రకటన చేసే అవకాశం!
Subhash Goud
|

Updated on: Feb 25, 2025 | 10:26 AM

Share

EPFO: సామాజిక భద్రతా పథకాన్ని నిర్వహిస్తున్న ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లోని దాదాపు 7 కోట్ల మంది ఖాతాదారులకు ఈ వారం చాలా ప్రత్యేకమైనది. ఫిబ్రవరి 28, 2025న EPFO ​సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశం జరగనుంది. దీనిలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేట్లకు సంబంధించి నిర్ణయం తీసుకోవచ్చు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కూడా EPFపై 8.25 శాతం వడ్డీ ఇస్తోంది.

కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశం జరుగుతుంది. అలాగే ఈ సమావేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి EPF పై వడ్డీ రేటుకు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నారు. CBT నుండి ఆమోదం పొందిన తర్వాత ఈ ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం పంపుతారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి EPF ఖాతాదారులకు 8.25 శాతం, 2022-23లో 8.15 శాతం, 2021-22లో 8.10 శాతం చొప్పున వడ్డీ అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో EPFO ​​తన పెట్టుబడిపై అందుకున్న అద్భుతమైన రాబడి కారణంగా, ఈ సంవత్సరం కూడా EPFO ​​ఖాతాదారులకు 8.25 శాతం వడ్డీని ఇవ్వవచ్చని భావిస్తున్నారు.

ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి ఈపీఎఫ్‌వో​​పథకం అతిపెద్ద సామాజిక భద్రతా పథకంగా పరిగణిస్తారు. ప్రతి నెలా ప్రైవేట్ రంగ ఉద్యోగుల జీతం నుండి పీఎఫ్‌ పేరుతో కొంత మొత్తాన్ని కట్‌ అవుతుంటుంది. ఈ మొత్తాన్ని యజమాని పీఎఫ్‌కి జమ చేస్తారు. ఉద్యోగం కోల్పోవడం, భవనం నిర్మించడం లేదా ఇల్లు కొనుగోలు చేయడం, వివాహం, పిల్లల విద్య లేదా పదవీ విరమణ వంటి సందర్భాల్లో ఉద్యోగులు పీఎఫ్‌ డబ్బును ఉపసంహరించుకోవచ్చు.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో EPFO ​​ఖాతాదారులకు వారి పెట్టుబడిపై రాబడిని అందించడానికి వడ్డీ స్థిరీకరణ రిజర్వ్ ఫండ్‌ను సృష్టించడంపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ ఫండ్‌ సృష్టించడం ద్వారా 7 కోట్ల EPFO ​​ఖాతాదారులకు వారి ప్రావిడెంట్ ఫండ్‌పై స్థిరమైన రాబడి పొందవచ్చు. వడ్డీ రేట్లు హెచ్చుతగ్గులకు గురైనప్పుడు లేదా EPFO ​​తన పెట్టుబడిపై తక్కువ రాబడిని పొందుతున్నప్పుడు కూడా ఇది ఖాతాదారులకు స్థిర రాబడిని అందిస్తుంది. ఈ పథకం ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల నుండి ఆమోదం పొందితే, దానిని 2026-27 నుండి అమలు చేయవచ్చు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలలో కార్మిక, ఉపాధి మంత్రితో పాటు ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులు ఉంటారు.

ఇది కూడా చదవండి: Azim Premji: భారత్‌లోనే అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త.. ప్రతిరోజూ రూ. 27 కోట్లు విరాళం.. ఇతనెవరో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..