Digital Fraud: పెరిగిపోతున్న సైబర్ మోసాలు.. ఆర్బీఐ నివేదికలు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
డిజిటల్ ఇండియా మిషన్ వేగవంతమైన పురోగతిని సాధించింది. ఇది ఆర్థిక లావాదేవీలను మరింత సులభతరం చేసింది. ప్రస్తుతం ప్రజలు చిన్న చిన్న లావాదేవీలను కూడా డిజిటల్గా చేస్తున్నారు. దీంతో పాటు దేశంలో సైబర్ దుండగుల మోసాల వల కూడా వేగంగా విస్తరిస్తోంది. ఈ అంశంపై ఆర్బీఐ..

డిజిటల్ ఇండియా మిషన్ వేగవంతమైన పురోగతిని సాధించింది. ఇది ఆర్థిక లావాదేవీలను మరింత సులభతరం చేసింది. ప్రస్తుతం ప్రజలు చిన్న చిన్న లావాదేవీలను కూడా డిజిటల్గా చేస్తున్నారు. దీంతో పాటు దేశంలో సైబర్ దుండగుల మోసాల వల కూడా వేగంగా విస్తరిస్తోంది. ఈ అంశంపై ఆర్బీఐ నివేదిక నిజంగా ఆందోళన కలిగిస్తోంది. డిజిటల్ మోసాలను అరికట్టేందుకు ఆర్బీఐ పట్టు బిగించింది. అన్ని రకాల మోసాల కేసులను రిపోర్ట్ చేయడం ఇప్పుడు తప్పనిసరి అని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ఆన్లైన్ మోసాలను నిరోధించేందుకు బ్యాంకులు ఎలాంటి ఏర్పాట్లు చేశాయని గట్టిగా ప్రశ్నిస్తోంది. ఆర్బీఐ 2022-23 వార్షిక నివేదిక ప్రకారం.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 9,097 మోసాలు జరిగాయి.
2022-23లో ఈ సంఖ్య 13,530కి పెరిగింది. కాబట్టి మోసాల సంఖ్య దాదాపు 48 శాతం పెరిగింది. అయితే, ఈ మోసాల్లో నష్టపోయిన మొత్తం 49 శాతం తగ్గింది. 2021-22 సంవత్సరంలో మొత్తం 59,819 కోట్ల రూపాయల మోసం జరిగింది. ఇది 2022-23లో 30,252 కోట్ల రూపాయలకు తగ్గింది. మోసంలో నష్టపోయిన డబ్బు మొత్తం తగ్గింది అంటే దేశంలో చిన్న చిన్న మోసాల సంఖ్య పెరిగింది అని అర్ధం చేసుకోవచ్చు. డిజిటల్ మోసాల గురించి చెప్పుకుంటే.. 2021-22 సంవత్సరంలో మొత్తం 3,596 డిజిటల్ మోసాలు నమోదయ్యాయి. ఇది 2022-23 ఆర్థిక సంవత్సరంలో 6,659 కేసులకు పెరిగింది. ఆ విధంగా, డిజిటల్ మోసాలకు సంబంధించిన కేసులు చాలా సంవత్సరాలలో రెట్టింపు అయ్యాయి.
మోసగాళ్లు ఇలాంటి మోసాలకు ఎలా పాల్పడుతున్నారు?
2022-23 సంవత్సరంలో దేశంలో మొత్తం 30,252 కోట్ల రూపాయల విలువైన బ్యాంకింగ్ సంబంధిత మోసాలు జరిగాయని ఆర్బిఐ నివేదిక పేర్కొంది. ఇందులో లోన్స్ కి సంబంధించిన మోసాలు 28,792 కోట్ల రూపాయలు. ఇది 95 శాతానికి సమానం. వీటిలో చాలా వరకు లోన్స్ పేరుతో మోసం చేశారు. దేశంలో ఎక్కువ మోసాలు డిజిటల్ చెల్లింపుల ద్వారా అంటే ఆన్లైన్ లావాదేవీల ద్వారా జరుగుతున్నాయి. సైబర్ దుండగులు ఓటీపీ అడగడం ద్వారా ప్రజల కార్డులు అలాగే వారి యూపీఐ ఉపయోగించి మరిన్ని మోసాలకు పాల్పడుతున్నారు.




కంపెనీలపై సైబర్ దాడుల ప్రమాదం ఏమిటి?
భారతీయ కంపెనీలపై సైబర్ దాడుల ప్రమాదం కూడా పెరుగుతోంది. అమెరికన్ డేటా సెక్యూరిటీ కంపెనీ రుబ్రిక్ నివేదిక ప్రకారం.. భారతదేశంలోని చాలా కంపెనీలు సైబర్ దాడుల ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. రుబ్రిక్ చేసిన సర్వే ప్రకారం.. 26 శాతం మంది ప్రజలు గత సంవత్సరంలో తమ కంపెనీలలో 100 కంటే ఎక్కువ సైబర్ దాడులకు ప్రయత్నాలు జరిగాయని చెప్పారు. కాగా, సైబర్ దాడుల కారణంగా 51 శాతం కంపెనీలు తమ కస్టమర్లను కోల్పోయాయి.
కేవైసీ పేరుతో మోసగాళ్లు మరిన్ని మోసాలకు పాల్పడుతున్నారు. కాలర్ ఐడి యాప్ ట్రూకాలర్ నివేదిక ప్రకారం.. స్పామ్ కాల్ల వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే దేశాలలో భారతదేశం ఒకటి. భారతదేశంలో 64% మంది వ్యక్తులు ప్రతిరోజూ మూడు లేదా అంతకంటే ఎక్కువ స్పామ్ కాల్లను అందుకుంటున్నారు. ఇక్కడ ప్రతి వినియోగదారుకు నెలకు స్పామ్ కాల్ల సగటు సంఖ్య 16.8గా ఉంది. రిపోర్ట్ ప్రకారం.. బ్యాంక్ కేవైసీ ధ్రువీకరణ ముసుగులో చాలా మోసాలు జరుగుతున్నాయి.
మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవచ్చు?
డిజిటల్ మోసాల సంఘటనలను నివారించడానికి జాగ్రత్త అత్యంత ప్రభావవంతమైన మార్గం అని సైబర్ నిపుణుడు దివ్య తన్వర్ చెబుతున్నారు. కేవైసీని అప్డేట్ చేసే ఎరలో పడకండి. చాలా మంది తమ దురాశ కారణంగా మోసాలకు గురవుతున్నారు. వాపసు – బోనస్ వంటి ఎరలో చిక్కుకోవద్దు. మీరు ఆన్లైన్ మోసాలకు గురైనట్లయితే, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. సైబర్ నేరాలకు సంబంధించి టోల్ ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేయండి. ఇది మీ డబ్బును తిరిగి పొందడంలో మీకు సహాయం చేస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి