Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SpiceJet: స్పైస్‌జెట్‌కు డీజీసీఏ రూ.10 లక్షల జరిమానా.. కారణం ఏంటో తెలుసా..?

SpiceJet: ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) స్పైస్‌జెట్‌పై రూ. 10 లక్షల జరిమానా విధించింది. DGCA తన బోయింగ్ 737 MAX విమానం పైలట్‌లకు సరిగ్గా లేని సిమ్యులేటర్‌పై..

SpiceJet: స్పైస్‌జెట్‌కు డీజీసీఏ రూ.10 లక్షల జరిమానా.. కారణం ఏంటో తెలుసా..?
Follow us
Subhash Goud

|

Updated on: May 30, 2022 | 9:03 PM

SpiceJet: ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) స్పైస్‌జెట్‌పై రూ. 10 లక్షల జరిమానా విధించింది. DGCA తన బోయింగ్ 737 MAX విమానం పైలట్‌లకు సరిగ్గా లేని సిమ్యులేటర్‌పై శిక్షణ ఇచ్చినందుకు ఈ పెనాల్టీని విధించింది. ఎందుకంటే ఇది విమానం భద్రతను ప్రభావితం చేస్తుంది. DGCA గత నెలలో 90 స్పైస్‌జెట్ పైలట్‌లను మాక్స్ విమానాలను నడపకుండా నిషేధించింది. పైలట్లకు సరైన శిక్షణ ఇవ్వలేదని తెలుసుకున్నారు. పైలట్లపై నిషేధం విధించిన తర్వాత రెగ్యులేటర్ విమానయాన సంస్థకు షోకేస్ నోటీసు జారీ చేసింది. DGCA ప్రకారం.. విమానయాన సంస్థ పంపిన సమాధానం సరైనది కాదని తేలింది.

విమాన భద్రతపై శిక్షణ ప్రభావం:

PTI నివేదిక ప్రకారం.. విమానయాన సంస్థ అందించే శిక్షణ విమాన భద్రతపై చెడు ప్రభావాన్ని చూపుతుందని, అందువల్ల DGCA తన మాక్స్ విమానాల పైలట్‌లకు శిక్షణలో చెడు సిమ్యులేటర్‌లను ఉపయోగించడాన్ని అనుమతించినందుకు రూ.10 లక్షల జరిమానా విధించినట్లు నివేదిక పేర్కొంది. జార్ఖండ్ రాజధాని రాంచీ విమానాశ్రయంలో వికలాంగ చిన్నారిని ఎక్కించనందుకు విమానయాన సంస్థ ఇండిగోకు శనివారం ముందురోజు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) రూ. 5 లక్షల జరిమానా విధించింది. మే 7న రాంచీ విమానాశ్రయంలో వికలాంగ పిల్లలతో ఇండిగో ఉద్యోగులు ప్రవర్తించిన తీరు తప్పుగా ఉందని, అది పరిస్థితిని మరింత దిగజార్చిందని డీజీసీఏ పేర్కొంది. అంతకుముందు DGCA నిజనిర్ధారణ కమిటీ ఇండిగో ఉద్యోగులు నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించి కంపెనీకి షో-కాజ్ నోటీసు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

రాంచీలో వికలాంగ చిన్నారిని దించిన కేసులో విచారణలో తేలిన ఆధారంగా, ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు అధీకృత ప్రతినిధి ద్వారా షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలిపింది. కమిటీ విచారణ ప్రకారం.. ఇండిగో ఉద్యోగులు ప్రయాణికులతో సక్రమంగా ప్రవర్తించలేదని, అందువల్ల వర్తించే నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించలేదని డిజిసిఎ కంపెనీకి నోటీసు జారీ చేసింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి