e-Shram portal: ఇ-శ్రమ్ పోర్టల్‌లో ఏయే వర్గాల వారు నమోదు చేసుకున్నారు..? వారికి 2 లక్షల ప్రయోజనం..!

e-Shram portal: ఈ -శ్రమ్ పోర్టల్‌లో నమోదైన అసంఘటిత రంగంలోని 27.69 కోట్ల మంది కార్మికులలో 94 శాతం మంది నెలకు రూ. 10,000 కంటే తక్కువ సంపాదిస్తున్నారు. ఇ-శ్రామ్ పోర్టల్ తాజా డేటా ప్రకారం....

e-Shram portal: ఇ-శ్రమ్ పోర్టల్‌లో ఏయే వర్గాల వారు నమోదు చేసుకున్నారు..? వారికి 2 లక్షల ప్రయోజనం..!
Follow us

|

Updated on: May 30, 2022 | 4:40 PM

e-Shram portal: ఈ -శ్రమ్ పోర్టల్‌లో నమోదైన అసంఘటిత రంగంలోని 27.69 కోట్ల మంది కార్మికులలో 94 శాతం మంది నెలకు రూ. 10,000 కంటే తక్కువ సంపాదిస్తున్నారు. ఇ-శ్రామ్ పోర్టల్ తాజా డేటా ప్రకారం.. పోర్టల్‌లో నమోదు చేసుకున్న కార్మికులలో 74 శాతం మంది షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), ఇతర వెనుకబడిన తరగతులు (OBC) ఉన్నారు. నవంబర్ 2021లో, అసంఘటిత రంగంలో నెలకు రూ. 10,000 కంటే తక్కువ వేతనం పొందుతున్న కార్మికుల సంఖ్య 92.37 శాతం ఉండగా, ఆ సమయంలో 8 కోట్ల మంది కార్మికులు పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. ఆ సమయంలో పోర్టల్‌లో నమోదు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ కార్మికుల సంఖ్య 72.58 శాతం ఉంది. దేశంలోని అసంఘటిత రంగంలోని కార్మికుల సమగ్ర డేటాబేస్ (NDUW)ని రూపొందించడం ఇ-శ్రమ్ పోర్టల్ లక్ష్యం. ఇ-శ్రమ్ పోర్టల్‌ను 26 ఆగస్టు 2021న ప్రారంభించబడింది. ఈ పోర్టల్ ద్వారా దేశంలోని అసంఘటిత రంగ కార్మికులందరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అసంఘటిత రంగంలోని కార్మికులందరి నమోదు ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలో పూర్తవుతుంది.

94.11% కార్మికులు 10 వేల కంటే తక్కువ సంపాదిస్తున్నారు. మొత్తం 27.69 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఇ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. అసంఘటిత రంగంలోని కార్మికులు అత్యంత పేదరికంలో జీవిస్తున్నారని, వారిలో ఎక్కువ మంది వెనుకబడిన వారేనని గణాంకాలు చెబుతున్నాయి. పోర్టల్‌లో నమోదైన అసంఘటిత రంగంలోని 94.11 శాతం మంది కార్మికులు నెలవారీ ఆదాయం రూ. 10,000 కంటే తక్కువగా ఉన్నట్లు డేటా చెబుతోంది. అదే సమయంలో 4.36 శాతం ఆదాయం రూ. 10,001 నుండి 15,000 మధ్య ఉంటుంది.

ఏ సంఘంలో ఎంతమంది సభ్యులు?

పోర్టల్‌లో నమోదైన కార్మికులలో 74.44 శాతం మంది వెనుకబడిన వర్గాల వారు. వీరిలో 45.32 శాతం ఓబీసీ, 20.95 శాతం ఎస్సీ, 8.17 శాతం ఎస్టీ వర్గాలకు చెందినవారు. జనరల్ కేటగిరీ కార్మికుల సంఖ్య 25.56 శాతం.

ఏ వయస్సులో ఎంతమంది సభ్యులు?

వయస్సు పరంగా చూస్తే.. 61.72 శాతం మంది కార్మికులు 18 నుండి 40 సంవత్సరాల వయస్సు గలవారు. 22.12 శాతం మంది 40 నుండి 50 సంవత్సరాల మధ్య ఉన్నారు. పోర్టల్‌లో నమోదైన 13.23 శాతం మంది కార్మికులు 50 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. అదే సమయంలో 2.93 శాతం వయస్సు 16 నుండి 18 సంవత్సరాల మధ్య ఉంది. పోర్టల్‌లో నమోదైన కార్మికులలో 52.81 శాతం మంది మహిళలు, 47.19 శాతం మంది పురుషులు ఉన్నారు.

నమోదులో ఈ రాష్ట్రం ముందంజలో ఉంది:

రిజిస్ట్రేషన్‌లో మొదటి ఐదు స్థానాల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఒడిశా ఉన్నాయి. నమోదిత కార్మికులలో 52.11 శాతం మంది ప్రధాన వృత్తి వ్యవసాయం. అదే సమయంలో 9.93 శాతం మంది ఇళ్లలో పనిచేస్తుండగా, 9.13 శాతం మంది నిర్మాణ రంగంలో పని చేస్తున్నారు.

2 లక్షల ప్రయోజనం

ఇ-శ్రమ్ పోర్టల్‌లో చేరిన కార్మికులు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) కింద రూ. 2 లక్షల వరకు బీమా ప్రయోజనం పొందుతారు. బీమా కోసం ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. వాస్తవానికి కార్మికుడు ప్రమాదంలో మరణిస్తే, లేదా పూర్తిగా అంగవైకల్యం చెందితే అప్పుడు రూ. 2 లక్షల బీమా మొత్తం లభిస్తుంది. మరోవైపు, పాక్షిక వైకల్యానికి రూ. 1 లక్ష బీమా లభిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు