AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Express: ఆ రెండు నగరాల మధ్య వందేభారత్ రైలు.. కేవలం గంటన్నర ప్రయాణం.!

జైపూర్-ఢిల్లీ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్‌లో ప్రారంభమవుతుంది. బుధవారం రైల్వేశాఖ ఈ రెండు నగరాల మధ్య రైలు రూట్ మ్యాప్‌ను..

Vande Bharat Express: ఆ రెండు నగరాల మధ్య వందేభారత్ రైలు.. కేవలం గంటన్నర ప్రయాణం.!
సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో స్టాప్‌లను కలిగి ఉంది. అయితే ఇది నగరాల మధ్య 660 కిమీ ప్రయాణాన్ని కవర్ చేస్తుంది. ఈ రైలు మొదటిరోజు.. సికింద్రాబాద్‌లో ఉదయం 11.30 గంటలకు బయలుదేరి 10 స్టాప్‌లలో ఆగి.. చివరి గమ్యస్థానమైన తిరుపతి రైల్వే స్టేషన్‌కి రాత్రి 9 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు 8 గంటల 30 నిమిషాల వ్యవధిలో గమ్యస్థానానికి చేరుకోనుంది. సికింద్రాబాద్‌ - తిరుపతి ఛైర్‌కార్‌ టికెట్ ధర రూ. 1680 గా నిర్ణయించారు.
Ravi Kiran
|

Updated on: Mar 25, 2023 | 9:17 PM

Share

జైపూర్-ఢిల్లీ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్‌లో ప్రారంభమవుతుంది. బుధవారం రైల్వేశాఖ ఈ రెండు నగరాల మధ్య రైలు రూట్ మ్యాప్‌ను విడుదల చేసింది. ఢిల్లీ, జైపూర్ మధ్య నడవనున్న వందేభారత్ రైలు మూడు స్టేషన్లలో ఆగుతుంది. గుర్గావ్, రేవారీ, అల్వార్ ఈ జాబితాలో ఉన్నాయి. మొదటి వారంలో ఈ ట్రైన్ వేగం గంటకు 72 కిలోమీటర్లు ఉంటుంది. అన్నీ సవ్యంగా సాగితే రైలు వేగాన్ని గంటకు 150 కిలోమీటర్లకు పెంతుతారు. ఇక ఢిల్లీ-జైపూర్ వందేభారత్ రైలు ట్రయల్ రన్ మార్చి 25 నుంచి ప్రారంభమవుతుంది.

ఈ రైలు ఢిల్లీ నుంచి సాయంత్రం 6.10 గంటలకు బయలుదేరి 6.45 గంటలకు గుర్గావ్ స్టేషన్‌కు చేరుకుంటుంది. అలాగే రేవారి జంక్షన్ వద్ద 7.35 గంటలకు వస్తుంది. ఆ తర్వాత రైలు రాత్రి 8.25 గంటలకు అల్వార్‌కు.. రాత్రి 10.20 గంటలకు జైపూర్‌కు చేరుతుంది. అటు ఈ రైలు మధ్యాహ్నం 12.15 గంటలకు అజ్మీర్ చేరుకుంటుంది. అంటే 442 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు ఆరు గంటల ఐదు నిమిషాల్లో చేరుకుంటుంది.

ఇక వందేభారత్ రైలు వేగం గంటకు 150 కి.మీకి పెరిగినప్పుడు కేవలం 1 గంట 45 నిమిషాల్లోనే జైపూర్ నుంచి ఢిల్లీ చేరుకుంటుంది. అలాగే జైపూర్ నుంచి అల్వార్‌కు ఈ రైలు కేవలం ఆరు గంటల్లో చేరుతుంది. బుధవారం మినహా అన్ని రోజులలో ఈ వందేభారత్ రైలు నడుస్తుంది.

మరోవైపు ఈ కొత్త రైలుకు సంబంధించిన ఫుడ్ మెనూని కూడా రైల్వే సిద్ధం చేసింది. ఇందులో ఆనియన్ కచోరీ, జోధ్‌పూర్ పులావ్, దాల్-బాటీ మొదలైనవి ఉంటాయి. వందేభారత్ రైళ్లలో 16 ప్యాసింజర్ కార్లు ఉంటాయి, వీటిలో 1,196 మంది ప్రయాణికులు కూర్చోగలరు. ఒక్కో కోచ్‌లో 78 సీట్లు ఉంటాయి. ఈ రైలు టికెట్ ధర రూ.800 ఉంటుందని అంచనా. అలాగే ఎగ్జిక్యూటివ్ కారు టిక్కెట్ ధర రూ.1800 ఉంటుందని సమాచారం. అయితే టికెట్ ఛార్జీలపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Follow Us
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ