Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Service Charge: కస్టమర్లకు భారీ షాక్.. సర్వీస్ ఛార్జ్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

టేకావే ఆర్డర్‌లపై సర్వీస్ ఛార్జ్ విధించవద్దని స్పష్టం చేసింది. ఈ అంశంపై తదుపరి విచారణ 25 నవంబర్ 2022న జరుగుతుంది.

Service Charge: కస్టమర్లకు భారీ షాక్.. సర్వీస్ ఛార్జ్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
Service Charge
Follow us
Venkata Chari

|

Updated on: Jul 20, 2022 | 5:18 PM

హోటల్, రెస్టారెంట్ పరిశ్రమకు ఢిల్లీ హైకోర్టు పెద్ద ఊరటనిచ్చింది. కస్టమర్ల నుంచి సర్వీస్ ఛార్జీలు వసూలు చేయరాదంటూ నేషనల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) మార్గదర్శకాలపై హైకోర్టు స్టే విధించింది. ఈ సమస్యను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని, తదుపరి విచారణ తేదీ వరకు నేషనల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఆర్డర్ వర్తించదని కోర్టు పేర్కొంది. CCPA జులై 4 మార్గదర్శకాలను సవాలు చేస్తూ NRAI, ఫెడరేషన్ ఆఫ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పిటిషన్లను విచారించిన జస్టిస్ యశ్వంత్ వర్మ, ఈ సమస్యను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ విషయమై అధికారులు కూడా సమాధానం చెప్పాలని కోరారు.

తదుపరి విచారణ నవంబర్ 25న..

హోటళ్లు, రెస్టారెంట్లు మెనూలో సేవా రుసుము సమాచారంతో పాటు ఆహార బిల్లు, టాక్స్‌తో పాటు ఈ సమాచారం అందుబాటులో ఉండాలనే షరతుతో సర్వీస్ ఛార్జీని రికవరీ చేయకూడదని కోర్టు స్టే విధించింది. రెస్టారెంట్‌లో విడిగా.. అక్కడికక్కడే చూపించాలని పేర్కొంది. కానీ, టేక్‌అవే ఆర్డర్‌లపై సర్వీస్‌ ఛార్జీ విధించలేకూడదని స్పష్టం చేసింది. ఈ అంశంపై తదుపరి విచారణ 25 నవంబర్ 2022న జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

వాస్తవానికి, జులై 4, 2022న, నేషనల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) ఒక ఆదేశాన్ని జారీ చేసింది. దీనిలో హోటళ్లు లేదా రెస్టారెంట్‌లు ఏ పేరుతోనైనా సర్వీస్ ఛార్జ్ వసూలు చేయవద్దని పేర్కొంది. ఆహార బిల్లుకు సర్వీస్ ఛార్జీని జోడించలేమని కూడా అధికార యంత్రాంగం తెలిపింది. ఏదైనా హోటల్‌లో ఫుడ్‌ బిల్లులో చేర్చేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

పెరుగుతున్న ఫిర్యాదుల మధ్య, వాణిజ్య కార్యకలాపాలు, వినియోగదారుల హక్కుల ఉల్లంఘనను నిరోధించడానికి CCPA మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. సర్వీస్ ఛార్జ్ చెల్లించమని ఏ హోటల్ లేదా రెస్టారెంట్ వినియోగదారులను ఒత్తిడి చేయవద్దని పేర్కొంది. కస్టమర్ తనకు కావాలంటే సర్వీస్ ఛార్జీని చెల్లించవచ్చు. అది కస్టమర్ ఇష్టానుసారం ఉంటుందని తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..