NSE Co Location case: ఎన్‌ఎస్‌ఈ కో-లొకేషన్ స్కామ్‌ కేసులో తనిఖీలు నిర్వహించిన సీబీఐ.. నిందితులకు బెయిల్‌ నిరాకరించిన కోర్టు..

ఎన్‌ఎస్‌ఈ కో-లొకేషన్ స్కామ్‌కు సంబంధించిన కేసుల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఈరోజు దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించింది. ముంబై, గాంధీనగర్, ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, కోల్‌కతాలోని బ్రోకర్లతో సంబంధం ఉన్న 12 ప్రదేశాల్లో సీబీఐ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించింది....

NSE Co Location case: ఎన్‌ఎస్‌ఈ కో-లొకేషన్ స్కామ్‌ కేసులో తనిఖీలు నిర్వహించిన సీబీఐ.. నిందితులకు బెయిల్‌ నిరాకరించిన కోర్టు..
Cbi
Follow us

|

Updated on: May 21, 2022 | 2:24 PM

ఎన్‌ఎస్‌ఈ కో-లొకేషన్ స్కామ్‌కు సంబంధించిన కేసుల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఈరోజు దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించింది. ముంబై, గాంధీనగర్, ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, కోల్‌కతాలోని బ్రోకర్లతో సంబంధం ఉన్న 12 ప్రదేశాల్లో సీబీఐ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించింది. ఈ కేసులో ఎన్‌ఎస్‌ఈ మాజీ సీఈవో, ఎండీ చిత్రా రామకృష్ణ(chitra Ramakrishnan), గ్రూప్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ఆనంద్‌ సుబ్రమణ్యంలపై చార్జిషీట్‌ దాఖలు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. తాజాగా ఢిల్లీ కోర్టు ఇద్దరు నిందితులకు బెయిల్ నిరాకరించింది. బ్రోకర్లు తమ సర్వర్‌లను NSE ప్రాంగణంలో ఉంచుకోవచ్చు, ఇది స్టాక్ మార్కెట్‌లో వేగంగా నవీకరించబడటానికి వారికి సహాయపడుతుంది. ఈ సేవ ద్వారా కొందరు బ్రోకర్లు మోసాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తు సంస్థలకు తెలిసింది. కొందరు బ్రోకర్లు అల్గారిథమ్‌లను తారుమారు చేసి కోట్లాది లాభాలు ఆర్జించినట్లు విచారణలో తేలింది.

2010 నుంచి 2015 మధ్య కాలంలో రామకృష్ణ ఏఎన్‌ఈ వ్యవహారాలు చూస్తున్నప్పుడు నిందితుల్లో ఒకరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్‌లోని ఓపీజీ సెక్యూరిటీ సెకండరీ పీఓపీ సర్వర్‌కు 670 ట్రేడింగ్ రోజుల పాటు కనెక్ట్ అయ్యారని విచారణలో తేలింది. మరోవైపు చిత్ర రామకృష్ణ, సుబ్రమణ్యంల హయాంలో ఎన్‌ఎస్‌ఈ అధికారులు కొందరు బ్రోకర్లకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలపైనా సీబీఐ విచారణ కొనసాగిస్తోంది. 2013లో మాజీ సీఈవో రవి నారాయణ్ స్థానంలో వచ్చిన రామకృష్ణ తన సలహాదారుగా సుబ్రమణ్యంను నియమించుకున్నారని, ఆ తర్వాత ఏటా రూ.4.21 కోట్ల భారీ వేతనంతో గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంలో హిమాలయాల్లో నివసిస్తున్న ఒక రహస్య యోగి గురించి కూడా ప్రస్తావన వచ్చింది, అతని సలహా మేరకు రామకృష్ణ ఈ నియామక నిర్ణయాలు తీసుకున్నారని తెలిసింది. 2018లో ఈ కేసులో ఢిల్లీ ఓపీజీ సెక్యూరిటీ ప్రమోటర్, స్టాక్ బ్రోకర్ సంజయ్ గుప్తాపై దర్యాప్తు సంస్థ చర్యలు తీసుకుంది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సిస్టమ్‌ను తప్పుగా యాక్సెస్ చేయడం ద్వారా లాభాలను ఆర్జించే విషయంలో ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్‌ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి..

'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
మన సినిమాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎవరో తెలుసా..
మన సినిమాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎవరో తెలుసా..
మితిమీరిన సంబరాలతో అడ్డంగా బుక్కైన ఢిల్లీ పేసర్..!
మితిమీరిన సంబరాలతో అడ్డంగా బుక్కైన ఢిల్లీ పేసర్..!
ఏపీలో విచిత్ర వాతావరణం.. వెదర్ రిపోర్ట్ ఇదిగో.!
ఏపీలో విచిత్ర వాతావరణం.. వెదర్ రిపోర్ట్ ఇదిగో.!
వేసవిలో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా IRCTC ప్యాకేజీ
వేసవిలో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా IRCTC ప్యాకేజీ
అదరగొట్టిన కోహ్లీ, పాటిదార్.. హైదరాబాద్ టార్గెట్ 207
అదరగొట్టిన కోహ్లీ, పాటిదార్.. హైదరాబాద్ టార్గెట్ 207
Viral: చెరువు దగ్గర మట్టిలో వింత ఆకారం.. తవ్వి చూడగా.!
Viral: చెరువు దగ్గర మట్టిలో వింత ఆకారం.. తవ్వి చూడగా.!
చిరంజీవి మృగరాజు సినిమాలో ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారట..
చిరంజీవి మృగరాజు సినిమాలో ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారట..