Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2025: తగ్గనున్న సెల్ ఫోన్ ధరలు? బడ్జెట్‌లో యాక్షన్‌ మార్పులు ఏంటి?

Budget 2025: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 1 ఫిబ్రవరి 2025న బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఇందులో ప్రభుత్వం బడ్జెట్‌లో కొన్ని ప్రత్యేక ప్రకటనలు చేయగలదని దేశ ప్రజలు భావిస్తున్నారు.అదే సమయంలో ఈ బడ్జెట్ కూడా లోటు బడ్జెట్‌గానే మిగిలిపోతుందని నిపుణులు చెబుతున్నారు..

Budget 2025: తగ్గనున్న సెల్ ఫోన్ ధరలు? బడ్జెట్‌లో యాక్షన్‌ మార్పులు ఏంటి?
Follow us
Subhash Goud

|

Updated on: Jan 27, 2025 | 4:13 PM

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2025-26ను సమర్పించనున్నారు. ఇది ఆమెకు 8వ బడ్జెట్‌. ఈ బడ్జెట్‌పై భారీ అంచనాలున్నాయి. అదే సమయంలో ఈ బడ్జెట్ కూడా లోటు బడ్జెట్‌గానే మిగిలిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ బడ్జెట్‌లో 8వ వేతన కమీషన్‌ పెంపుదల ఉంది. అలాగే ఈ బడ్జెట్‌లో మహిళలు, చిన్నారులు, యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని భావిస్తున్నారు.

సెల్‌ ఫోన్‌ ధరలు తగ్గుతాయా?

అలాగే ఆరోగ్య రంగం, విద్యా రంగం ఇలా అన్ని రంగాల్లోనూ భారీ అంచనాలున్నాయి. దీంతో ఫిబ్రవరి 1న బడ్జెట్‌ ప్రకటన కోసం యావత్‌ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై జీఎస్టీ పన్నును కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తారా? అనే ప్రశ్న తలెత్తుతుంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై జీఎస్టీ పన్ను తగ్గిస్తే సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ తదితర ధరలు తగ్గే అవకాశం ఉంది. ఈ బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. భారత్‌లో ఉపయోగించే కాంపోనెంట్స్‌పై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని, తద్వారా సెల్‌ఫోన్ల ధరలు తగ్గుతాయని నిపుణులు తెలిపారు.

బడ్జెట్‌లో క్రియాత్మక మార్పులు:

ఇది కాకుండా, మొబైల్స్ కాకుండా స్మార్ట్ టీవీలు వంటి ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు కూడా చౌకగా ఉంటాయి. అందువల్ల ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ పై సుంకాన్ని తగ్గించాలని ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. జీఎస్టీలో కోత దేశీయ ఫోన్ తయారీదారులకు ఉపశమనం కలిగిస్తుంది. ప్రస్తుతం సెల్ ఫోన్ ఉపకరణాలపై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. సెల్ ఫోన్ల ధరలు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. అందుకే రానున్న బడ్జెట్‌లో ఎలక్ట్రానిక్ వస్తువులపై పన్ను ప్రకటన కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అంతే కాదు టెలికాం సేవల టారిఫ్ కూడా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. ఇటీవల జియో, ఎయిర్‌టెల్ వంటి టెలికాం సేవల ఛార్జీలు భారీగా పెరిగాయి. దీంతో వినియోగదారులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో టెలికమ్యూనికేషన్ సేవలపై దిగుమతి సుంకాన్ని తగ్గించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది తగ్గితే టెలికాం సర్వీస్ ఛార్జీలు కూడా తగ్గే అవకాశం ఉంది. అయితే, సెల్ ఫోన్లు, సెల్ ఫోన్ స్పేర్ పార్ట్స్, టీవీ, టెలికాం సేవలపై ప్రకటనలు వస్తాయో లేదో చూద్దాం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి