Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget-2024: నిర్మలమ్మ బడ్జెట్‌పైనే ఆ రంగం భారీ ఆశలు.. ఈసారి కేంద్రం ఎలాంటి సాయం అందించేనో.?

. ముఖ్యంగా పర్యటక రంగం, రెస్టారెంట్‌, హస్పిటాలిటీ పరిశ్రమపై ఎన్నో ఆశలు ఉన్నాయి. ఈ బడ్జెట్‌లో ఈ పరిశ్రమలకు మరిన్ని నిధులు కేటాయించి మెరుగుపర్చే విధంగా చర్యలు చేపట్టాలన్నది చర్చ జరుగుతోంది. భారతదేశం మరింత మంది పర్యాటకులను ఆకర్షించడానికి, ఆర్థిక వృద్ధిని పెంచడానికి మరొక ప్రాంతంగా పర్యాటకాన్ని నిర్మించాలని కేంద్రం ఆలోచిస్తున్న నేపథ్యంలో ఆశలు..

Budget-2024: నిర్మలమ్మ బడ్జెట్‌పైనే ఆ రంగం భారీ ఆశలు.. ఈసారి కేంద్రం ఎలాంటి సాయం అందించేనో.?
Budget 2024
Follow us
Subhash Goud

|

Updated on: Jan 19, 2024 | 3:40 PM

ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మోడీ ప్రభుత్వానికి ఇది మధ్యంత బడ్జెట్‌. తర్వాత ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో వివిధ రంగాలలో చాలా మంది ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బడ్జెట్‌లో నిర్మలాసీతారామన్‌ ఎలాంటి ప్రకటనలు చేస్తారోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా పర్యటక రంగం, రెస్టారెంట్‌, హస్పిటాలిటీ పరిశ్రమపై ఎన్నో ఆశలు ఉన్నాయి. ఈ బడ్జెట్‌లో ఈ పరిశ్రమలకు మరిన్ని నిధులు కేటాయించి మెరుగుపర్చే విధంగా చర్యలు చేపట్టాలన్నది చర్చ జరుగుతోంది. భారతదేశం మరింత మంది పర్యాటకులను ఆకర్షించడానికి, ఆర్థిక వృద్ధిని పెంచడానికి మరొక ప్రాంతంగా పర్యాటకాన్ని నిర్మించాలని కేంద్రం ఆలోచిస్తున్న నేపథ్యంలో ఆశలు మరింతగా పెరిగాయి. అయితే పర్యాటక ప్రాంతాలకు ప్రాప్యతను పెంపొందించే మౌలిక సదుపాయాల పెట్టుబడులు, పరిశ్రమ రంగ ఆకర్షణను పెంపొందించడం, నియంత్రణ ప్రక్రియలను క్రమబద్ధీకరించడం, వ్యాపారాన్ని సులభతరం చేయడం, వ్యవస్థాపకతను పెంపొందించడం వంటివి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమర్పణకు ముందు పరిశ్రమ దృష్టి సారిస్తున్నారు.

భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (GDP)కి పర్యాటకం, ఆసుపత్రి పరిశ్రమ కీలక సహకారంగా కొనసాగుతోందని దక్షిణాసియాలోని రాడిసన్ హోటల్ గ్రూప్ ఛైర్మన్ ఎమెరిటస్, ప్రిన్సిపల్ అడ్వైజర్ కెబి కచ్రు చెబుతున్నారు. దేశంలో ఎక్కువగా స్థానిక పెట్టుబడులను ప్రోత్సహించడానికి, అలాగే హోటళ్ల రంగాన్ని ప్రపంచ పోటీతత్వాన్ని పెంపొందించడానికి చర్యలు చేపట్టాలన్నారు. వస్తువులు, సేవల పన్ను (GST) మరింత హేతుబద్ధీకరణతో పాటు హోటల్ రంగానికి పూర్తిగా అభివృద్ధి దిశగా కొనసాగిస్తే మంచిదని ఆయన అభిప్రాయపడుతున్నారు.

అలాగే పర్యటక, హోటల్‌ వంటి ప్రాజెక్టుల ఆమోదాలను సులభతరం చేయాలంటున్నారు. అలాగే లైసెన్స్‌ల విషయంలో ఎక్కువ ప్రాసెస్ లేకుండా సులభతరమైన మార్గాలను సృష్టించడం చాలా అవసరమంటున్నారు. అలాగే దేశంలో పర్యటక, హోటల్‌ పరిశ్రమలను మెరుగు పర్చడం వల్ల దేశంలో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని అన్నారు. అంతేకాకుండా దేశంలో పర్యటక, హోటల్‌ రంగాలు పెరిగినట్లయితే ఉపాధితో పాటు సందర్శకుల తాకిడి పెరుగుతుందన్నారు. దీని వల్ల పెట్టుబడులు కూడా పెరుగుతాయని ఆయన అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

అలాగే ఇన్‌బౌండ్ టూరిస్ట్ ట్రాఫిక్‌ను ఆకర్షించడానికి వీసా ప్రక్రియను సరళీకృతం చేయడం కూడా ముఖ్యమన్నారు. ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌కు అనుగుణంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఈ బడ్జెట్‌లో మరిన్ని నిధులు కేటాయించడంపై దృష్టి పెట్టాలంటున్నారు. పర్యాటక గమ్యస్థానాలకు ప్రాప్యతను పెంపొందించే మౌలిక సదుపాయాల పెట్టుబడులు, పరిశ్రమల ఆకర్షణను మెరుగుపరచడం, క్రమబద్దీకరించాలంటున్నారు. అలాగే వ్యాపారాన్ని సులభతరం చేయడం, వ్యవస్థాపకతను ప్రోత్సహించడం వంటివి వాటిపై ఈ మధ్యంతర బడ్జెట్‌లో నిర్ణయాలు తీసుకోవాలన్నారు.

ఇక జీఎస్టీ విషయాన్నిహైలైట్ చేస్తూ నక్షత్ర రెస్టారెంట్ సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ ప్రణవ్ రుంగ్తా మాట్లాడుతూ.. దేశంలో జీఎస్టీ అంశాలపై ఈ బడ్జెట్‌లో దృష్టి సారించాలంటున్నారు. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ పునరుద్ధరణ, సర్వీస్ ఎక్స్‌పోర్ట్ ఫ్రమ్ ఇండియా స్కీమ్‌ను పునరుద్ధరించడం చాలా ముఖ్యమంటున్నారు. పరిశ్రమ హోదా ప్రకారం ప్రత్యేక ఆహార సేవల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలంటున్నారు. వివిధ రకాల పదార్థాలపై జీఎస్‌టీని తగ్గించడం వంటి వాటిపై ఈ బడ్జెట్‌లో దృష్టి పెట్టాలని చెప్పారు. అలాగే వాణిజ్యపరమైన అద్దెలపై GSTని తగ్గించడం, లైసెన్స్‌ల ప్రక్రియను సులభతరం చేయడం వల్ల ఈ పరిశ్రమ రంగం మరింతగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయన్నారు.

అలాగే SMEల కోసం సబ్సిడీ పథకాలను అమలు చేయడంపై దృష్టి సారించాలని అభిప్రాయపడుతున్నారు. ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించి పరిశ్రమ రంగాన్ని అభివృద్ధి చేస్తే పరిశ్రమ రంగం పెరగడమే కాకుండా ఉపాధి అవకాశాలను కూడా సృష్టించవచ్చంటున్నారు. రెస్టారెంట్ పరిశ్రమ 7.20 మిలియన్లకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించిందని, దాదాపు రూ.4.23 లక్షల కోట్ల వార్షిక టర్నోవర్‌ను నమోదు చేసిందని రుంగ్తా పేర్కొన్నారు.

హాస్పిటాలిటీ పరిశ్రమలో వ్యాపారాలపై భారాన్ని తగ్గించడానికి పన్నుల విషయంలో మినహాయింపులు ఉండాలని హోటల్స్‌ గ్రూప్‌ భారత వైస్‌ ప్రెసిడెంట్‌ రమీ పౌరభ్‌ గహోయ్ అన్నారు. అభివృద్ధి చెందుతున్న పర్యాటక పర్యావరణ వ్యవస్థను పెంపొందించే విధానాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు గహోయ్ చెప్పారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి