AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Make In India: గత దశాబ్దంలో మొబైల్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం ఎలా మారిపోయిందో తెలుసా..? కేంద్ర మంత్రి ఆసక్తికర ట్వీట్

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా నినాదంతో దూసుకెళ్తోంది.. ‘మేక్ ఇన్ ఇండియా’ క్యాంపెయిన్ తో పదేళ్లుగా ఎన్నో ఆవిష్కరణలకు నాంది పలకడంతోపాటు.. ఎంతో వృద్ధిని సాధించింది.. అయితే.. గత దశాబ్దంలో భారతదేశంలో మొబైల్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం గణనీయంగా వృద్ధి చెందింది. గతంతో పోలిస్తే.. ఈ పదేళ్లలో ఎంతో వృద్ధిని సాధించామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.

Make In India: గత దశాబ్దంలో మొబైల్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం ఎలా మారిపోయిందో తెలుసా..? కేంద్ర మంత్రి ఆసక్తికర ట్వీట్
PM Modi - Ashwini Vaishnaw
Shaik Madar Saheb
|

Updated on: Feb 04, 2025 | 6:01 PM

Share

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా నినాదంతో దూసుకెళ్తోంది.. ‘మేక్ ఇన్ ఇండియా’ క్యాంపెయిన్ తో పదేళ్లుగా ఎన్నో ఆవిష్కరణలకు నాంది పలకడంతోపాటు.. ఎంతో వృద్ధిని సాధించింది.. అయితే.. గత దశాబ్దంలో భారతదేశంలో మొబైల్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం గణనీయంగా వృద్ధి చెందింది. గతంతో పోలిస్తే.. ఎంతో వృద్ధిని సాధించామని.. గత దశాబ్దంలో భారతదేశ మొబైల్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం ఎలా మారిపోయిందో ఒకసారి చూడండి.. అంటూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ X లో పోస్ట్ చేశారు..

మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా మొబైల్ తయారీ రంగంలో గత 10 సంవత్సరాలలో ప్రభుత్వం ఎంతవరకు పురోగతి సాధించిందో వివరించారు. దీనితో పాటు, ఎగుమతి రంగంలో పురోగతిపై ఆయన అనేక గణాంకాలను కూడా పంచుకున్నారు.

2014 సంవత్సరంలో దేశంలో కేవలం 2 మొబైల్ తయారీ యూనిట్లు మాత్రమే ఉండగా, నేడు ఆ సంఖ్య 300 దాటిందని మంత్రి అన్నారు. దీనితో పాటు, ఈ రంగంలో పెట్టుబడి, ఉత్పత్తిలో భారీ పెరుగుదల ఉందని వివరించారు. దీని కారణంగా భారతదేశం నేడు ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీలో అగ్రగామిగా ఎదుగుతోందన్నారు.

పదేళ్లలో ఎగుమతుల్లో భారీ పెరుగుదల..

2014లో మొబైల్ ఫోన్ తయారీ విలువ కేవలం రూ.18,900 కోట్లు మాత్రమేనని, 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది రూ.4,22,000 కోట్లకు పెరిగిందని అశ్విని వైష్ణవ్ అన్నారు.

అంతేకాకుండా, 2014లో మొబైల్ ఎగుమతులు దాదాపు సున్నాగా ఉండగా, ఇప్పుడు అది రూ.1,29,000 కోట్లు దాటిందన్నారు.

ప్రభుత్వం చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమాల కింద దేశంలో ఉత్పత్తి భారీగా పెరిగిందని.. భారతదేశం ఎలక్ట్రానిక్స్ తయారీకి ప్రధాన కేంద్రంగా మారిందని తెలిపారు.

‘మేక్ ఇన్ ఇండియా’ నుంచి ఆత్మనిర్భర్ వరకు..

భారతదేశం ఇప్పుడు మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలోనే కాకుండా బొమ్మలు, రక్షణ పరికరాలు, ఎలక్ట్రిక్ వాహన మోటార్ల ఉత్పత్తిలో కూడా స్వావలంబన వైపు పయనిస్తోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకారం.. 1950 – 1990 మధ్య అమలు చేయబడిన కఠినమైన విధానాల కారణంగా తయారీ రంగం దెబ్బతింది.. కానీ ‘మేక్ ఇన్ ఇండియా’ దానిని పూర్తిగా మారుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ చొరవ భారతదేశంలో ఉత్పత్తిని పెంచడంలో, స్వావలంబనను ప్రోత్సహించడంలో, ఉపాధిని సృష్టించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు.

దేశీయ ఉత్పత్తికి ప్రోత్సాహం..

గత దశాబ్దంలో మొబైల్ ఫోన్ తయారీ రంగం 12 లక్షలకు పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలను సృష్టించిందని వైష్ణవ్ అన్నారు. ప్రభుత్వం ఇప్పుడు విలువను, వృద్ధిని మరింత లోతుగా తీసుకువెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇందులో దేశీయంగా మరిన్ని భాగాలు, చిప్‌ల ఉత్పత్తి కూడా ఉందన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కింద, ఛార్జర్, బ్యాటరీ ప్యాక్, USB కేబుల్, కీప్యాడ్, డిస్ప్లే అసెంబ్లీ, కెమెరా మాడ్యూల్, లిథియం-అయాన్ సెల్, స్పీకర్, మైక్రోఫోన్ వంటి అనేక భాగాలు ఇప్పుడు భారతదేశంలో తయారు చేయబడుతున్నాయని మంత్రి వైష్ణవ్ అన్నారు. మేక్ ఇన్ ఇండియా భారతదేశ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాన్ని బాగా బలోపేతం చేసిందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us