AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనిల్ అంబానీ కీలక నిర్ణయం.. ఒక్కసారిగా భారీ కుదుపుకు గురైన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేరు..

అనిల్ అంబానీ కీలక నిర్ణయంతో మార్కెట్లు ఒక్కసారిగా జెంప్ అయ్యాయి. అప్పుల సంక్షోభంలో ఇరుక్కున్న అనిల్ తీసుకున్న నిర్ణయం తీవ్ర ప్రభావం చూపించింది. తాను

అనిల్ అంబానీ కీలక నిర్ణయం.. ఒక్కసారిగా భారీ కుదుపుకు గురైన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేరు..
Reliance Infrastructure Lim
Sanjay Kasula
|

Updated on: Apr 01, 2021 | 5:08 PM

Share

Ambani-led Reliance: అనిల్ అంబానీ కీలక నిర్ణయంతో మార్కెట్లు ఒక్కసారిగా జెంప్ అయ్యాయి. అప్పుల సంక్షోభంలో ఇరుక్కున్న అనిల్ తీసుకున్న నిర్ణయం తీవ్ర ప్రభావం చూపించింది. తాను నిర్వహిస్తున్న రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రధాన ఆస్తిని అమ్మేస్తున్నట్లుగా ప్రకటించారు. ప్రైవేటు రంగ బ్యాంకు అయిన “యస్‌” బ్యాంకు చెల్లించాల్సిన అప్పులు తీర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించారు.

అయితే అనిల్ అబాని తన వేలకోట్ల రూపాయల విలువ చేసే ఆస్తిని విక్రయించారు. బ్యాంక్‌కి బకాయి పడిన కోట్ల రూపాయల అప్పుని తీర్చేందుకు ముంబైలోని రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ముంబై ప్రధాన కార్యాలయం ‘రిలయన్స్ సెంటర్‌ను’ను విక్రయించారు.ఈ పరిణామంతో స్టాక్ మార్కెట్‌లో రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేరు దాదాపు 9.50శాతం పెరిగిపోయాయి.

రిలయన్స్‌ ఇన్‌ఫ్రా తీసుకున్న ఈ నిర్ణయాన్ని మార్కెట్‌ సమాచారంలో ఈ విషయాని ప్రకటించింది. యస్‌ బ్యాంకు(S BANK) రుణాన్ని తిరిగి చెల్లించే ఉద్దేశంతో వాటిని అమ్మేయాలని నిర్ణియించారు. వాటి లావాదేవీల విలువ రూ .1200 కోట్లు అని ఆ సంస్థ తెలిపింది. ఈ అమ్మకంతో బ్యాంక్ ఇదే ఆఫీస్‌ని తన కార్పోరేట్ హెడ్‌క్వార్డర్స్‌గా మార్చుకోనుంది. కాగా 2021 జనవరిలోనే రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తం 3 ఆస్తులను విక్రయించింది. 3,600 కోట్ల రూపాయలకు ఢిల్లీ ఆగ్రా టోల్ రోడ్.. 900 కోట్ల రూపాయల పర్బతి కోల్డామ్ ట్రాన్స్‌మిషన్ అమ్మిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి : Kendriya Vidyalaya Admission 2021-22: తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. కేంద్రీయ విద్యాలయం నోటిఫికేషన్ చివరి తేదీ ఎప్పుడంటే..!

యాదాద్రి గుట్టల్లో బుసలు కొట్టిన బ్లాక్ మనీ.. ఐటీ సోదాలపై కేంద్ర ఆర్థిక శాఖ క్లారిటీ

లడ్డూ,పులిహోర తయారీ లెక్కల్లో తేడాలు..చీరల విక్రయాల్లోనూ ఆమ్యామ్యాలు.. లెక్క తేల్చే పనిలో విజిలెన్స్ అధికారులు