AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2026: EV కార్‌ కొనాలనుకుంటున్నారా? కాస్త ఆగండి! బడ్జెట్‌లో తర్వాత కొంటే..

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ సరసమైన ఎలక్ట్రిక్ వాహనాల (EV) అమ్మకాలను పెంచే అవకాశం ఉంది. పన్ను రాయితీలు, సబ్సిడీల ద్వారా వాహనాల ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. భారత్‌లో EVలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఇది ఒక గేమ్ ఛేంజర్ కావచ్చు.

Budget 2026: EV కార్‌ కొనాలనుకుంటున్నారా? కాస్త ఆగండి! బడ్జెట్‌లో తర్వాత కొంటే..
Electric Car
SN Pasha
|

Updated on: Jan 30, 2026 | 2:59 PM

Share

మీరు ఎలక్ట్రిక్‌ కారు కొనాలని ఆలోచిస్తుంటే, కాస్త ఆగండి. ఎందుకంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇది సరసమైన, ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలను పెంచేలా ప్రయోజనాలు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బడ్జెట్‌ తర్వాత వాహనాల ధరలు తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకూ వేగంగా పెరుగుతోంది. ప్రభుత్వం దీని కోసం పన్ను రాయితీలు, సబ్సిడీలు, సులభమైన ఫైనాన్సింగ్ వంటి చర్యలు తీసుకోవచ్చు.

దేశంలోనే అతిపెద్ద ఆటో కంపెనీ అయిన టాటా మోటార్స్, ప్రభుత్వాన్ని ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ కార్లు, ఫ్లీట్ కార్యకలాపాలలో ఉపయోగించే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని కోరింది. ప్యాసింజర్ వాహన మార్కెట్ మెరుగుపడుతోందని, అయితే సరసమైన ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పటికీ సవాళ్లను ఎదుర్కొంటున్నాయని కంపెనీ చెబుతోంది. టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్, CEO శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకున్న ప్రారంభ చర్యలు ఆటో రంగానికి సహాయపడ్డాయని, అయితే ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నాయని అన్నారు.

PM ఇ-డ్రైవ్ పథకం..

ప్రభుత్వం ఇప్పటికే PM e-డ్రైవ్ పథకాన్ని అమలు చేస్తోంది. దీని కింద కంపెనీలు, సంస్థలకు ఫ్లీట్ EVలను కొనుగోలు చేయడానికి సబ్సిడీలు, ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.10,000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. అయితే ఇది ఇంకా సాధారణ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ కార్లను నేరుగా చేర్చలేదు. నివేదికల ప్రకారం.. బడ్జెట్ సరసమైన EVలపై దృష్టి పెడితే అది దేశ EV రంగానికి పెద్ద గేమ్ ఛేంజర్ కావచ్చు. ఇది కంపెనీలు ఉత్పత్తిని పెంచడానికి, కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేయడానికి, ఉపాధి అవకాశాలను సృష్టించడానికి సహాయపడుతుంది. సరైన పన్ను ప్రోత్సాహకాలు, సబ్సిడీలతో, రాబోయే సంవత్సరంలో సరసమైన ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి రావొచ్చు. మొత్తం మీద బడ్జెట్ 2026 సామాన్యులకు సరసమైన, అందుబాటులో ఉండే ఎలక్ట్రిక్ వాహనాలకు ఒక మైలురాయి కావచ్చు. సరైన చర్యలు తీసుకుంటే దేశంలో గ్రీన్ ఎనర్జీ వైపు పెద్ద మార్పుకు నాంది పలుకుతాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి