AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రిటైర్మెంట్‌ టైమ్‌లో రూ.2 కోట్లు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఇలా చేయండి!

పదవీ విరమణ తర్వాత రూ.2 కోట్ల నిధిని సాధించడం ప్రతి ఉద్యోగి కల. కేవలం పొదుపు కాకుండా, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని దీర్ఘకాలిక, క్రమబద్ధమైన పెట్టుబడులు అవసరం. SIPల ద్వారా కాంపౌండింగ్ ప్రయోజనం పొందవచ్చు. పెట్టుబడులను ఈక్విటీ, డెట్లలో విభజించడం, వయసు పెరిగేకొద్దీ రిస్క్ తగ్గించడం ముఖ్యం.

రిటైర్మెంట్‌ టైమ్‌లో రూ.2 కోట్లు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఇలా చేయండి!
Indian Currency 7
SN Pasha
|

Updated on: Apr 04, 2026 | 5:59 PM

Share

పదవీ విరమణ తర్వాత ప్రశాంతమైన జీవితం గడపాలని ప్రతి ఉద్యోగి కలగంటాడు. ఈ నేపథ్యంలో రూ.2 కోట్ల రిటైర్మెంట్ నిధి అనేది చాలా మందికి సాధారణ లక్ష్యంగా మారింది. అయితే కేవలం బ్యాంకులో డబ్బు పొదుపు చేయడం ద్వారా ఈ లక్ష్యం సాధ్యం కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలిక ప్రణాళిక, క్రమబద్ధమైన పెట్టుబడులు, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్న వ్యూహం అవసరం. ప్రస్తుతం నెలకు రూ.50,000తో కుటుంబ ఖర్చులు నిర్వహించగలిగినా, వచ్చే 20 సంవత్సరాల్లో అదే జీవనశైలి కొనసాగించాలంటే మరింత పెద్ద నిధి అవసరం అవుతుంది. ద్రవ్యోల్బణం కారణంగా వస్తువుల ధరలు పెరుగుతుండటంతో, ఈ రోజు సరిపడే మొత్తం భవిష్యత్తులో తక్కువగా మారే అవకాశం ఉంది. అందుకే త్వరగా పెట్టుబడులు ప్రారంభించడం కీలకం.

ముఖ్యంగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లు (SIPలు) దీర్ఘకాలంలో కాంపౌండింగ్ ద్వారా పెద్ద మొత్తాన్ని సృష్టించడంలో సహాయపడతాయి. పెట్టుబడుల విషయంలో ఒకే మార్గాన్ని ఎంచుకోవడం ప్రమాదకరం. కేవలం సురక్షిత మార్గాలైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా పూర్తిగా స్టాక్ మార్కెట్‌పై ఆధారపడటం రెండూ రిస్క్‌ను పెంచుతాయి. అందుకే పెట్టుబడులను విభజించడం ముఖ్యమైనది. ఈక్విటీ, డెట్, ఇతర సురక్షిత ఆస్తుల మధ్య సమతుల్యత ఉండేలా పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవాలి. ఇది మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

మరోవైపు స్టాక్ మార్కెట్ స్థిరంగా ఉండదు. పదవీ విరమణకు సమీపంలో మార్కెట్ పడిపోతే, పెద్ద నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఉదాహరణకు 30 శాతం పతనం జరిగితే రూ.2 కోట్ల నిధి రూ.1.6 కోట్లకు తగ్గిపోవచ్చు. ఈ రిస్క్‌ను తగ్గించేందుకు వయసు పెరుగుతున్న కొద్దీ ఈక్విటీ పెట్టుబడులను తగ్గించి, డెట్ ఫండ్‌లు లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ల వాటాను పెంచడం అవసరం. నిపుణుల ప్రకారం ద్రవ్యోల్బణాన్ని పట్టించుకోకపోవడం, మొత్తం డబ్బును ఒకే ఆస్తి వర్గంలో పెట్టడం, పెట్టుబడులను సమీక్షించకపోవడం వంటి పొరపాట్లు రిటైర్మెంట్ ప్రణాళికను దెబ్బతీస్తాయి. సరైన క్రమశిక్షణతో, ముందస్తు ప్రణాళికతో పెట్టుబడులు కొనసాగిస్తే, 20 ఏళ్లలో రూ.2 కోట్ల నిధి నిర్మించడం సాధ్యమేనని వారు సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us