AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ration Card: రేషన్‌కార్డుదారులకు గుడ్‌న్యూస్‌.. మరోసారి గడువు పొడిగించిన కేంద్రం

ఈ రోజుల్లో అన్నింటికి ఆధార్‌ను అనుసంధానం చేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఎందుకంటే మోసాలు జరుగకుండా, అక్రమాలు జరుగకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. పాన్‌ కార్డు, బ్యాంకు అకౌంట్‌, ఓటర్‌ ఐడి, రేషన్‌ కార్డు ఇలా ఎన్నో రకాల వాటికి ఆధార్‌తో అనుసంధానం చేయాలని నిబంధనలు తీసుకువస్తంది. అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)

Ration Card: రేషన్‌కార్డుదారులకు గుడ్‌న్యూస్‌.. మరోసారి గడువు పొడిగించిన కేంద్రం
Aadhaar Ration Card
Subhash Goud
|

Updated on: Jun 12, 2024 | 4:37 PM

Share

ఈ రోజుల్లో అన్నింటికి ఆధార్‌ను అనుసంధానం చేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఎందుకంటే మోసాలు జరుగకుండా, అక్రమాలు జరుగకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. పాన్‌ కార్డు, బ్యాంకు అకౌంట్‌, ఓటర్‌ ఐడి, రేషన్‌ కార్డు ఇలా ఎన్నో రకాల వాటికి ఆధార్‌తో అనుసంధానం చేయాలని నిబంధనలు తీసుకువస్తంది. అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) కింద రేషన్ తీసుకునే లబ్ధిదారులకు రేషన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానించడానికి ప్రభుత్వం మూడు నెలల గడువును పొడిగించింది. 2024 సెప్టెంబర్ 30 వరకు వినియోగదారులు రేషన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకోవచ్చని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. మునుపటి నోటిఫికేషన్‌లో, జూన్ 30, 2024 వరకు దీనికి సమయం ఇచ్చారు. ఫిబ్రవరి 2017లో, పిడిఎస్ కింద ప్రయోజనాలను పొందేందుకు ప్రభుత్వం రేషన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయడాన్ని తప్పనిసరి చేసింది. అయితే, దాని గడువు ఇప్పటి వరకు అనేక సార్లు పొడిగించింది.

నోటిఫికేషన్ ప్రకారం, నిర్ణీత గడువులోగా రేషన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయాల్సి ఉంటుంది. లేదా ఆధార్ లేని లబ్ధిదారులు దాని కోసం దరఖాస్తు చేసి దాని రుజువును సమర్పించాలి. చాలా మంది పీడీఎస్ వినియోగదారులు ఇప్పటికే తమ రేషన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారు. అప్పటి వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి డిసెంబర్ 20, 2023న లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో, ఇప్పటి వరకు 99.8 శాతం రేషన్ కార్డులు ఆధార్‌తో అనుసంధానించబడి ఉన్నాయని చెప్పారు.

ఎలా అప్‌డేట్ చేయాలి?

ఇవి కూడా చదవండి

రేషన్ కార్డ్ E-KYCని పొందడానికి మీ ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేసి ఉండాలి. అందులో నమోదు చేసిన బయోమెట్రిక్ వివరాల ప్రకారం రేషన్ కార్డు అప్‌డేట్ చేయబడుతుంది. మీ ఆధార్ కార్డ్ అప్‌డేట్ కాకపోతే మీరు ముందుగా దాన్ని అప్‌డేట్ చేసుకోవాలి. రేషన్ కార్డు E-KYC కోసం మీరు రేషన్ పొందే దుకాణానికి వెళ్లాలి. అయితే మీరు రేషన్ కార్డు సమాచారాన్ని ఆన్‌లైన్‌లో కూడా తనిఖీ చేయవచ్చు. ఒక్కో రాష్ట్రానికి ప్రత్యేక సైట్‌ను రూపొందించారు. మొత్తం సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత మీరు రేషన్ కార్డు సమాచారాన్ని తనిఖీ చేయవచ్చు. దీని తరువాత సభ్యులందరూ వెళ్లి బయోమెట్రిక్ ప్రకారం E-KYC చేయించుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి