AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Modi Action plan: మొదటి 100 రోజుల్లో మోడీ ప్రభుత్వం తీసుకోబోయే సాహసోపేతమైన నిర్ణయాలు.. యాక్షన్‌ ప్లాన్‌ ఏంటి?

బీజేపీ అధినేత నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల ప్రచారానికి ముందు, నరేంద్ర మోడీ మోడీ 3.0 ప్రభుత్వం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. ఆయన కొన్ని చోట్ల ప్రస్తావించారు. ఇప్పుడు మోడీ మంత్రివర్గం ఈ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేస్తోంది. అయితే ఈ వంద రోజుల్లో పెద్ద నిర్ణయం తీసుకోనున్నారు.

Modi Action plan: మొదటి 100 రోజుల్లో మోడీ ప్రభుత్వం తీసుకోబోయే సాహసోపేతమైన నిర్ణయాలు.. యాక్షన్‌ ప్లాన్‌ ఏంటి?
Pm Modi
Subhash Goud
|

Updated on: Jun 12, 2024 | 12:53 PM

Share

బీజేపీ అధినేత నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల ప్రచారానికి ముందు, నరేంద్ర మోడీ మోడీ 3.0 ప్రభుత్వం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. ఆయన కొన్ని చోట్ల ప్రస్తావించారు. ఇప్పుడు మోడీ మంత్రివర్గం ఈ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేస్తోంది. అయితే ఈ వంద రోజుల్లో పెద్ద నిర్ణయం తీసుకోనున్నారు.

మోదీ ప్రభుత్వ హయాంలో పెట్టుబడుల ఉపసంహరణ ఇంకా ముందుకు సాగలేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం పెద్దగా సాధించలేదు. అయితే ఇప్పుడు మోడీ ప్రభుత్వం మొదటి 100 రోజుల్లో తన ఎజెండా కింద కొన్ని పెద్ద అడుగులు వేయబోతోంది. ఈ 100 రోజుల్లో ఏం జరుగుతుందనే ఊహాగానాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. సీనియర్ వర్గాల నుండి వచ్చిన నివేదికల ప్రకారం, ప్రభుత్వం IDBI బ్యాంక్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SCI)లో తన వాటాను తగ్గించుకుంటుంది.

ఈ కంపెనీలపై దృష్టి

ఇవి కూడా చదవండి

ప్రభుత్వం మొదటి 100 రోజుల్లో పెట్టుబడుల ఉపసంహరణపై దృష్టి సారిస్తుంది. ప్రధానంగా ప్రభుత్వ జాబితాలో ఐడీబీఐ బ్యాంక్, షిప్పింగ్ కార్పొరేషన్ ఉన్నాయి. గతేడాది ఎన్నికల సంవత్సరం. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని కోల్డ్ స్టోరేజీలో పెట్టింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వానికి 63.75 శాతం వాటా ఉంది. అలాగే, ఐడీబీఐ బ్యాంక్ డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియ చాలా కాలంగా నిలిచిపోయింది. ఈ బ్యాంకులో ప్రభుత్వానికి 49.29 శాతం వాటా, ఎల్‌ఐసికి 45.48 శాతం వాటా ఉంది. ఐడీబీఐ బ్యాంక్‌లో తన మొత్తం వాటాను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది.

NMDC స్టీల్ లిమిటెడ్, BEML, HLL లైఫ్‌కేర్ కూడా ప్రభుత్వ జాబితాలోని పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్. అంతకుముందు 2022లో ప్రభుత్వం ఎయిర్ ఇండియా, నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (NINL)లో తన వాటాను విక్రయించింది. స్టాక్ మార్కెట్‌లో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మంచి పనితీరును కనబరుస్తోంది. గత నెలలో షేరు ధర 19 శాతం, ఏడాదిలో 134 శాతం పెరిగింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి