AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyberattack: ఒక్క బలహీనమైన పాస్‌వర్డ్ 158 ఏళ్ల కంపెనీని కూల్చివేసింది.. సైబర్ దాడితో నిరుద్యోగులుగా మారిన 700 మంది

Cyberattack: ఈ సంఘటన సైబర్ భద్రత ప్రాముఖ్యతను, బలహీనమైన పాస్‌వర్డ్‌ల తీవ్రమైన పరిణామాలను మరోసారి హైలైట్ చేసింది. నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ (NCSC) CEO రిచర్డ్ హోర్న్, సంస్థలు తమ వ్యవస్థలను, వ్యాపారాలను బలమైన, మరింత సురక్షితమైన చర్యలతో భద్రపరచుకోవాల్సిన..

Cyberattack: ఒక్క బలహీనమైన పాస్‌వర్డ్ 158 ఏళ్ల కంపెనీని కూల్చివేసింది.. సైబర్ దాడితో నిరుద్యోగులుగా మారిన 700 మంది
Subhash Goud
|

Updated on: Jul 26, 2025 | 8:00 AM

Share

Cyberattack: 158 ఏళ్ల బ్రిటిష్ రవాణా సంస్థ అయిన KNP లాజిస్టిక్స్, ఒకే ఒక బలహీనమైన పాస్‌వర్డ్ కారణంగా సైబర్ దాడికి గురైంది. దీని వలన కంపెనీ మూసి వేయాల్సి వచ్చింది. ఈ కంపెనీ 700 మంది ఉద్యోగులను పని నుండి తొలగించారు. అకిరా గ్యాంగ్ అని పిలువబడే రాన్సమ్‌వేర్ గ్రూప్ ఒక ఉద్యోగి హ్యాక్ చేసిన పాస్‌వర్డ్‌ను ఉపయోగించి కంపెనీ వ్యవస్థల్లోకి చొరబడి, డేటాను ఎన్‌క్రిప్ట్ చేసి, విమోచన క్రయధనాన్ని డిమాండ్ చేసింది. విమోచన క్రయధనం చెల్లించడంలో విఫలమైన ఫలితంగా కంపెనీ డేటా నాశనం చేసింది. ఇది దాని పతనానికి దారితీసింది. ఈ సంఘటన ఆన్‌లైన్ భద్రత, బలమైన పాస్‌వర్డ్‌ల ప్రాముఖ్యత గురించి కఠినమైన హెచ్చరికను అందిస్తుంది.

ఒక కంపెనీ పతనానికి పాస్‌వర్డ్ ఎలా కారణమైంది ?

ముఖ్యంగా నైట్స్ ఆఫ్ ఓల్డ్ బ్రాండ్ కింద దాదాపు 500 లారీలను నడుపుతున్న KNP లాజిస్టిక్స్ దారుణమైన, సైబర్ దాడికి గురైంది. ఒక ఉద్యోగి బలహీనమైన పాస్‌వర్డ్ కారణంగా ఈ దాడి జరిగిందని తెలుస్తోంది. దీనిని హ్యాకర్లు సులభంగా ఊహించి అనధికార యాక్సెస్‌ను పొందారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు పండగే.. ఆగస్ట్‌లో వరుస సెలవులు.. వారం రోజులు ఎంజాయ్‌!

బీబీసీ నివేదిక ప్రకారం.. అకిరా గ్యాంగ్ అనే రాన్సమ్‌వేర్ గ్రూప్ కేఎన్‌పీ కంప్యూటర్ సిస్టమ్‌లోకి చొరబడి దాని డేటాను దొంగిలించింది. సిస్టమ్‌లోకి చొరబడిన తర్వాత హ్యాకర్లు కంపెనీ డేటాను ఎన్‌క్రిప్ట్ చేసి, అంతర్గత వ్యవస్థలను లాక్ చేశారు. ఉద్యోగులు కీలకమైన వ్యాపార సమాచారాన్ని యాక్సెస్ చేయకుండా నిరోధించారు. యాక్సెస్‌ను పునరుద్ధరించడానికి డీక్రిప్షన్ కీకి బదులుగా హ్యాకర్లు డబ్బును డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: సింగిల్‌ ఛార్జింగ్‌తో 580 కి.మీ మార్కెట్‌లో దుమ్మురేపే కారు

ఈ డిమాండ్‌లో మొత్తం వెల్లడించనప్పటికీ, నిపుణులు అంచనా ప్రకారం అది దాదాపు £5 మిలియన్లు (సుమారు రూ.52 కోట్లు) ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. దురదృష్టవశాత్తు, కేఎన్‌పీ ఈ డిమాండ్‌ను తీర్చలేకపోయింది. దీని ఫలితంగా కంపెనీ డేటా పూర్తిగా నష్టపోయింది. చివరికి కంపెనీ పతనమైంది. KNP డైరెక్టర్ పాల్ అబాట్ పాస్‌వర్డ్ దొంగిలించడం వల్ల ఈ దాడి జరిగిందని ధృవీకరించారు అధికారులు.

సైబర్ భద్రత

ఈ సంఘటన సైబర్ భద్రత ప్రాముఖ్యతను, బలహీనమైన పాస్‌వర్డ్‌ల తీవ్రమైన పరిణామాలను మరోసారి హైలైట్ చేసింది. నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ (NCSC) CEO రిచర్డ్ హోర్న్, సంస్థలు తమ వ్యవస్థలను, వ్యాపారాలను బలమైన, మరింత సురక్షితమైన చర్యలతో భద్రపరచుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. హ్యాకర్లు సాధారణంగా కొత్త పద్ధతులను కనుగొనడం కంటే ఉన్న ప్లాన్‌లను ఉపయోగించుకుంటారని, బలహీనమైన భద్రత ఉన్న సంస్థల కోసం నిరంతరం వెతుకుతున్నారని ఆయన అన్నారు.

సైబర్ దాడులను నివారించడానికి సంస్థలు ఏమి చేయాలి ?

  • బలమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లు: ఉద్యోగులు బలమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలి. అలాగే వాటిని క్రమం తప్పకుండా మార్చాలి.
  • మల్టీ-ఫాక్టర్ ప్రామాణీకరణ ( MFA): లాగిన్ కోసం మల్టీ-ఫాక్టర్ ప్రామాణీకరణ (MFA) అమలు చేయాలి.
  • రెగ్యులర్ శిక్షణ: అన్ని ఉద్యోగులకు రెగ్యులర్ సైబర్ సెక్యూరిటీ శిక్షణ నిర్వహించాలి.
  • డేటా బ్యాకప్: కంపెనీలు తమ డేటాను క్రమం తప్పకుండా, సురక్షితంగా బ్యాకప్ చేయాలి.
  • అత్యవసర ప్రతిస్పందన ప్రణాళికలు: సైబర్ దాడి జరిగినప్పుడు ఎలా స్పందించాలో బలమైన ప్రణాళికలను డెవలప్‌ చేయాలి.
  • సైబర్-దాడి బీమా: మీరు సైబర్-దాడి బీమాకు సభ్యత్వాన్ని పొందడాన్ని పరిగణించాలి.
  • డిజిటల్ యుగంలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద నష్టాలను కలిగిస్తుందని, సైబర్ భద్రత ఐచ్ఛికం కాకుండా తప్పనిసరి అవసరమని ఈ సంఘటన ద్వారా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Viral Video: అయ్యో వీటికి కూడా పిల్లల పరేషాన్ తప్పదా..? పిల్ల చింపాంజీ చేసిన కొంటె పనికి తలపట్టుకున్న తల్లి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి