AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

March 1 Rule Change: మార్చి 1 నుంచి కొత్త నిబంధనలు..లేకుంటే ఇబ్బంది పడాల్సిందే!

ప్రతి నెల మొదటి తేదీన డబ్బుకు సంబంధించిన అనేక నియమాలలో మార్పులు జరుగుతుంటాయి. ఇవి మీ జేబు, జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. మార్చి 1, 2024 నుండి అనేక నియమాలు మారబోతున్నాయి. ఎల్‌పిజి సిలిండర్ ధరలు ప్రతి నెలా మొదటి తేదీన నిర్ణయించబడతాయి. ఎల్‌పీజీ సిలిండర్‌ ఖరీదుగా మారిన ప్రభావం బడ్జెట్‌లో కనిపిస్తోంది. ఈ నిబంధనల గురించి తెలుసుకుందాం..

March 1 Rule Change: మార్చి 1 నుంచి కొత్త నిబంధనలు..లేకుంటే ఇబ్బంది పడాల్సిందే!
March Rules
Subhash Goud
|

Updated on: Feb 29, 2024 | 6:00 AM

Share

ప్రతి నెల మొదటి తేదీన డబ్బుకు సంబంధించిన అనేక నియమాలలో మార్పులు జరుగుతుంటాయి. ఇవి మీ జేబు, జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. మార్చి 1, 2024 నుండి అనేక నియమాలు మారబోతున్నాయి. ఎల్‌పిజి సిలిండర్ ధరలు ప్రతి నెలా మొదటి తేదీన నిర్ణయించబడతాయి. ఎల్‌పీజీ సిలిండర్‌ ఖరీదుగా మారిన ప్రభావం బడ్జెట్‌లో కనిపిస్తోంది. ఈ నిబంధనల గురించి తెలుసుకుందాం..

  1. ఎల్పీజీ ధర: ఎల్‌పీజీ ధరలు ప్రతి నెలా మొదటి తేదీన నిర్ణయించబడతాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు దేశీయ వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను ప్రతి నెల మొదటి తేదీన నిర్ణయిస్తాయి. వాణిజ్య సిలిండర్ల ధరలను కంపెనీలు పెంచవచ్చన్న అంచనాలు ఉన్నాయి. 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1053, ముంబైలో రూ.1052.50, బెంగళూరులో రూ.1055.50, చెన్నైలో రూ.1068.50గా ఉంది.
  2. ఫాస్ట్ ట్యాగ్: ఫాస్టాగ్ కేవైసీ అప్‌డేట్ చేయడానికి చివరి తేదీని ఫిబ్రవరి 29గా నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా (NHAI) నిర్ణయించింది. అంటే, మీ ఫాస్టాగ్ కేవైసీని రేపటిలోగా పూర్తి చేయండి. లేదంటే నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా మీ ఫాస్టాగ్‌ని డియాక్టివేట్ చేయవచ్చు లేదా బ్లాక్‌లిస్ట్ చేయవచ్చు.
  3. సోషల్ మీడియా కొత్త నిబంధనలు: ప్రభుత్వం తాజాగా ఐటీ నిబంధనలను మార్చింది. X, Facebook, YouTube, Instagram వంటి సోషల్ మీడియా యాప్‌లు ఈ నిబంధనలను అనుసరించాలి. మార్చి నుంచి సోషల్ మీడియాలో తప్పుడు వాస్తవాలతో కూడిన కంటెంట్‌ ప్రసారం చేస్తే, దానికి జరిమానా విధించవచ్చు. సామాజిక మాధ్యమాలను సురక్షితంగా ఉంచడమే ప్రభుత్వ లక్ష్యం.
  4. జీఎస్టీ నిబంధనలు: జీఎస్టీ కొత్త నిబంధనల ప్రకారం రూ.5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారులు ఇప్పుడు ఇ-చలాన్ ఇవ్వకుండా ఇ-వే బిల్లు జారీ చేయలేరు. మార్చి 1 నుంచి వారి అన్ని రకాల వ్యాపార లావాదేవీలపై ఇది వర్తిస్తుంది. జీఎస్టీ పన్ను విధానంలో రూ.50 వేల కంటే ఎక్కువ విలువైన వస్తువులను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పంపినప్పుడు ఈ-వే బిల్లును నిర్వహించడం తప్పనిసరి
  5. ఇవి కూడా చదవండి
  6. ఎస్బీఐ: ఇక దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రెడిట్ కార్డులకు సంబంధించి కొత్త నిబంధనలను మార్చి నుంచి అమలు చేయనుంది. క్రెడిట్ కార్డుల మినిమమ్ డే బిల్ కాలిక్యులేషన్ ప్రక్రియలో పలు మార్పులు చేసినట్లు తెలిపింది. కొత్త రూల్స్‌ మార్చి 15 నుంచి అమల్లోకి వస్తాయని ఎస్బీఐ స్పష్టం చేసింది.
  7. వ్యాపారులు: చాలా మంది వ్యాపారులు బీ2బీ, బీ2ఈ పన్ను చెల్లింపుదారులతో ఇ – ఇన్ వాయిస్ లతో లింక్ చేయకుండానే ఇ – వే బిల్లులు జారీ చేస్తూ లావాదేవీలు జరుపుతున్నారని కేంద్ర జాతీయ సమాచార కేంద్రం (ఎన్ఐసీ) గుర్తించింది. ఈ క్రమంలో ఇ – వే బిల్లులు, ఇ – చలాన్ల నమోదు సరిపోలడం లేదు. దీంతో నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..
ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..
అటుకుల బియ్యం పాయసం.. అమృతమే తింటున్నంత కమ్మగా..
అటుకుల బియ్యం పాయసం.. అమృతమే తింటున్నంత కమ్మగా..
ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ అసలు ధర తెలిస్తే మూర్ఛపోవాల్సిందే..?
ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ అసలు ధర తెలిస్తే మూర్ఛపోవాల్సిందే..?
అత్యంత చౌకైన EV కారుపై రూ.80 వేలు తగ్గింపు.. 230 కి.మీ రేంజ్‌..!
అత్యంత చౌకైన EV కారుపై రూ.80 వేలు తగ్గింపు.. 230 కి.మీ రేంజ్‌..!