బ్రేకింగ్..లాక్ డౌన్ పొడిగింపు ప్రసక్తే లేదు.. కేంద్రం

కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ ను పొడిగించవచ్చునని వస్తున్న వార్తలను కేంద్రం తోసిపుచ్చింది. ఇవి వదంతులు మాత్రమేనని, వీటిని చూసి తాను ఆశ్చర్యపోయానని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అన్నారు.

బ్రేకింగ్..లాక్ డౌన్ పొడిగింపు ప్రసక్తే లేదు.. కేంద్రం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 30, 2020 | 11:25 AM

కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ ను పొడిగించవచ్చునని వస్తున్న వార్తలను కేంద్రం తోసిపుచ్చింది. ఇవి వదంతులు మాత్రమేనని, వీటిని చూసి తాను ఆశ్చర్యపోయానని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అన్నారు. పొడిగింపు వార్తలు నిరాధారమైనవని  స్పష్టం చేశారు. వలస కార్మికులు పెద్ద సంఖ్యలో తమ ప్రాంతాలకు వెళ్లేందుకు సిధ్ధపడడంతో కేంద్రం లాక్ డౌన్ కాల  పరిమితిని పొడిగించే సూచనలున్నాయని కొన్ని పత్రికల్లో వార్తలు కూడా వచ్చ్చాయి. అయితే ఇది ఫేక్ న్యూస్ అని ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ట్వీట్ చేసింది. ఈ విధమైన ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని రాజీవ్ గౌబా పేర్కొన్నారు. ఏప్రిల్ 14 తో లాక్ డౌన్ కాల పరిమితి ముగుస్తుంది అని గౌబా వివరించారు.