AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీ కార్యాలయం ముందు రసాభాస.. తొలి జాబితాకు ముందే తన్నులాట.. కమలనాథులకు కొత్త నెత్తి నొప్పి

దుబ్బాక విజయంతో దూకుడు పెంచిన తెలంగాణ బీజేపీ నేతలకు కొత్త నెత్తి నొప్పి వచ్చిపడింది. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ కోసం డిమాండ్ భారీగా పెరగడం ఎటూ తేల్చుకోలేక నేతలు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా పెద్ద నేతలు తమ బంధువులకు టిక్కెట్లిస్తున్నారంటూ బీజేపీ క్యాడర్ పార్టీ ఆఫీసు ముందు ఆందోళనకు దిగింది.

బీజేపీ కార్యాలయం ముందు రసాభాస.. తొలి జాబితాకు ముందే తన్నులాట.. కమలనాథులకు కొత్త నెత్తి నొప్పి
Rajesh Sharma
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 17, 2020 | 8:18 PM

Share

Protests in front of BJP office: దుబ్బాక విజయంతో దూకుడు మీదున్న బీజేపీలో గ్రేటర్ ఆశావహుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దాంతో అభ్యర్థుల తొలి జాబితాను బుధవారం ప్రకటించేందుకు పార్టీ నాయకత్వం రెడీ అవుతుంటే మరోవైపు టిక్కెట్ కోసం ఆశ పెట్టుకుని.. రాదేమో అన్న ఆందోళన గురవుతున్న వారు మంగళవారం సాయంత్రం బీజేపా రాష్ట్ర కార్యాలయం దగ్గర హంగామా చేశారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ప్రియారిటీ ఇస్తున్నారంటూ బీజేపీ ఆఫీసు ముందు నినాదాలు చేశారు.

మొదటి జాబితా ప్రకటన ముందే టికెట్ ఆశావహులు ఆందోళనకు దిగడం పార్టీ నాయకత్వానికి నెత్తినొప్పిగా మారింది. ఎప్పుడు లేనివిధంగా బీజేపీలో సీనియర్ నేతల బంధువులకు టిక్కెట్లిచ్చే సంస్కృతి వచ్చిందంటూ ఆశావహులు నాంపల్లి కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. బందువులకు టికెట్లు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. గోషా మహల్ టికెట్ బీజేపీ సీనియర్ నేత డా.కే.లక్ష్మణ్ తన బావమరిదికి కేటాయించడం పట్ల కార్యకర్తలు అసంతృప్తి చేశారు. ఆయన ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చాడని, అతనికి టిక్కెట్ ఎలా ఇస్తారని వారు నిలదీశారు. లక్ష్మణ్‌కు వ్యతిరేకంగా బీజేపీ కార్యాలయం ముందు నినాదాలు చేశారు. జియాగూడ టికెట్ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు తనయుడు సాయికి కేటాయించడంపై కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ALSO READ: రేపే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా..

ALSO READ: జగన్ హామీలన్నీ నీటి మూటలు.. వీడియో కాన్ఫరెన్సులో చంద్రబాబు కామెంట్లు

ALSO READ: జీహెచ్ఎంసీ బరిలో జనసేన.. బీజేపీకి సంకటమేనా?

ALSO READ: అళగిరికి బీజేపీ గాలం.. త్వరలో అమిత్‌షాతో అళగిరి భేటీ!

ALSO READ: గుంటూరులో గోవా లిక్కర్.. ధరలు తగ్గినా ఆగని