AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాశ్మీర్ పై ఉగ్ర కన్ను.. ఈసారి టార్గెట్ ఎవరంటే ..?

ఆర్టికల్ 370 రద్దు, కాశ్మీర్ విభజనపై ఆగ్రహంతో ఊగిపోతున్న ఉగ్రవాద సంస్థలు భారత్ లో భారీ కుట్రకు తెరలేపయని ఇంటిలెజెన్స్ బ్యూరో హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోమ్ శాఖా మంత్రి, బీజేపీ అధినేత అమిత్ షా ,సెక్యూరిటీ సలహాదారు అజిత్ దోవల్ లను మట్టుపెట్టేందుకు జైష్-ఏ-మహమ్మద్ సంస్థ కుట్ర చేస్తోందని ఐబీ వెల్లడించింది. ముఖ్యులను మట్టుబెట్టడంతోపాటు కాశ్మీర్ లోని పది చోట్ల భారీ ఉగ్ర దాడికి వ్యూహ రచన చేస్తోందని ఐబీ వెల్లడించింది. […]

కాశ్మీర్ పై ఉగ్ర కన్ను.. ఈసారి టార్గెట్ ఎవరంటే ..?
Rajesh Sharma
|

Updated on: Sep 25, 2019 | 1:46 PM

Share

ఆర్టికల్ 370 రద్దు, కాశ్మీర్ విభజనపై ఆగ్రహంతో ఊగిపోతున్న ఉగ్రవాద సంస్థలు భారత్ లో భారీ కుట్రకు తెరలేపయని ఇంటిలెజెన్స్ బ్యూరో హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోమ్ శాఖా మంత్రి, బీజేపీ అధినేత అమిత్ షా ,సెక్యూరిటీ సలహాదారు అజిత్ దోవల్ లను మట్టుపెట్టేందుకు జైష్-ఏ-మహమ్మద్ సంస్థ కుట్ర చేస్తోందని ఐబీ వెల్లడించింది. ముఖ్యులను మట్టుబెట్టడంతోపాటు కాశ్మీర్ లోని పది చోట్ల భారీ ఉగ్ర దాడికి వ్యూహ రచన చేస్తోందని ఐబీ వెల్లడించింది. అమెరికా మాదిరే భారత్‌లో కూడా 9/11 తరహా దాడులు చేసేందుకు పథకం పన్నుతున్నారని ఇంటిలిజెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. జమ్మూకశ్మీర్‌లో ఆత్మాహుతి దాడితోపాటు దేశవ్యాప్తంగా 30 చోట్ల పేలుళ్లకు కుట్ర పన్నినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే 10 మంది జైషే ఉగ్రవాదులు భారత్‌లో చొరబడినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఇంటిలెజన్స్‌ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పఠాన్‌ కోట్‌, జమ్మూకశ్మీర్‌, శ్రీనగర్‌లో ఆరెంజ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. రాష్ట్రాలను అప్రమత్తం చేయడమే కాక.. భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించాయి. ఐబీ హెచ్చరికలతో అప్రమత్తమైన కేంద్ర హోమ్ శాఖా దేశంలోని అన్ని ఎయిర్ పోర్టుల్లో భద్రత పెంచాలని ఆదేశించింది. టూరిస్ట్ స్పాట్లలో భద్రత రెట్టింపు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోమ్ శాఖా సూచించింది. దేశ రాజధాని ఢిల్లీలో భద్రత బలగాలు పలు చోట్ల తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా పంజాబ్, హర్యానా, కాశ్మీర్ నుండి ఢిల్లీకి చేరే రహదారులతో పాటు కీలక మార్గాలలో పలు చోట్ల తనిఖీలు చేపట్టారు. పఠాన్ కోట ఎయిర్ ఫోర్స్ బేస్ తోపాటు దేశంలోని మరో మూడు ఎయిర్ బేస్ లకు భద్రతను పెంచారు. తాజా హెచ్చరిక గతంలో ఎన్నడూ లేనంత కీలక సమాచారం ఆధారంగా రావడంతో దేశవ్యాప్తంగా హై అలెర్ట్ పరిస్థితి కనిపిస్తోంది.

Follow Us
అదృష్టం కలసొచ్చింది.... అబ్బ అబ్బా.. వీరు ఏం చేసినా డబ్బే డబ్బు!
అదృష్టం కలసొచ్చింది.... అబ్బ అబ్బా.. వీరు ఏం చేసినా డబ్బే డబ్బు!
ఇరాన్ వైమానిక దళానికి భారీ దెబ్బ..!
ఇరాన్ వైమానిక దళానికి భారీ దెబ్బ..!
భోజనం చేసిన తర్వాత కాఫీ, టీ తాగుతున్నారా ? అయితే ఈ సమస్యలు తప్పవు
భోజనం చేసిన తర్వాత కాఫీ, టీ తాగుతున్నారా ? అయితే ఈ సమస్యలు తప్పవు
పదో తరగతి అర్హతతో డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్‌లో ఉద్యోగాలు
పదో తరగతి అర్హతతో డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్‌లో ఉద్యోగాలు
కాస్త కొత్తగా.. కొబ్బరి, అటుకులతో ఉప్మా.. ఇలా చేస్తే అదిరిపోద్దీ!
కాస్త కొత్తగా.. కొబ్బరి, అటుకులతో ఉప్మా.. ఇలా చేస్తే అదిరిపోద్దీ!
ఆ గ్రామానికీ.. ఆ పక్షులకీ మధ్య.. శతాబ్దాలుగా విడదీయరాని బంధం
ఆ గ్రామానికీ.. ఆ పక్షులకీ మధ్య.. శతాబ్దాలుగా విడదీయరాని బంధం
వెండి మీద కూడా మీరు లోన్ తీసుకోవచ్చు.. రూల్స్ ఏంటంటే..?
వెండి మీద కూడా మీరు లోన్ తీసుకోవచ్చు.. రూల్స్ ఏంటంటే..?
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 5+3+3 కాంబినషన్‌తో బరిలోకి..?
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 5+3+3 కాంబినషన్‌తో బరిలోకి..?
ఇందులో నెలకు రూ. 1,000 పెట్టుబడి పెడితే మీకు ఎంత రాబడి వస్తుంది?
ఇందులో నెలకు రూ. 1,000 పెట్టుబడి పెడితే మీకు ఎంత రాబడి వస్తుంది?
డబ్‌స్మాష్ ద్వారా పాపులర్.. కట్ చేస్తే క్రేజీ హీరోయిన్..
డబ్‌స్మాష్ ద్వారా పాపులర్.. కట్ చేస్తే క్రేజీ హీరోయిన్..