AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లగడపాటి సర్వే సమగ్ర వివరాలు

ఆంధ్రా ఆక్టోపస్‌గా  పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ తన ఆర్జీ ఫ్లాష్ టీం చేసిన ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశారు.  ఆయన  చెప్పినట్లుగానే తిరుపతి స్వామివారి సన్నిధిలో సర్వే ఫలితాలను వివరించారు. ఇవి శాస్త్రీయంగా జరిగిన సర్వే అని ఎవరి ఒత్తిళ్లు తనపై లేవన్నారు. ముందుగా తెలంగాణలోని పార్లమెంట్ ఫలితాలపై లగడపాటి తన టీం అంచనాను వివరించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు 14 నుంచి 16 ఎంపీ సీట్లు…కాంగ్రెస్‌కు 0 నుంచి 2 వరకు..అలాగే బీజేపీ 0 నుంచి 1 […]

లగడపాటి సర్వే సమగ్ర వివరాలు
Ram Naramaneni
|

Updated on: May 19, 2019 | 7:11 PM

Share

ఆంధ్రా ఆక్టోపస్‌గా  పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ తన ఆర్జీ ఫ్లాష్ టీం చేసిన ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశారు.  ఆయన  చెప్పినట్లుగానే తిరుపతి స్వామివారి సన్నిధిలో సర్వే ఫలితాలను వివరించారు. ఇవి శాస్త్రీయంగా జరిగిన సర్వే అని ఎవరి ఒత్తిళ్లు తనపై లేవన్నారు.

ముందుగా తెలంగాణలోని పార్లమెంట్ ఫలితాలపై లగడపాటి తన టీం అంచనాను వివరించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు 14 నుంచి 16 ఎంపీ సీట్లు…కాంగ్రెస్‌కు 0 నుంచి 2 వరకు..అలాగే బీజేపీ 0 నుంచి 1 సీటును గెలుచుకొనే అవకాశం ఉందని చెప్పారు. తెలంగాణలోని ప్రజలందరూ సంపూర్ణంగా టీఆర్‌‌ఎస్‌కు మద్ధతు పలికారని తెలిపారు.

ఇక ఆంధ్రప్రదేశ్ ఫలితాలపై ఆయన స్పందిస్తూ తెలుగుదేశమే మళ్లీ అధికారంలోకి రాబోతోందని తెలిపారు. ప్రస్తుతం జరుగుతోన్న సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రం పరిపూర్ణంగా కొనసాగలంటే ప్రజలు చంద్రబాబువైపు నిలబడాలని నిర్ణయించుకున్నారని అన్నారు.

అలాగే ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ అన్ని చోట్లా గట్టి పోటి ఇచ్చిందని తెలిపారు. జగన్ సారధ్యంలో వైసీపీ అధికారంలోకి రాకపోయినా గణనీయమైన ప్రజా మద్దతుతో మంచి సీట్లు సంపాదించారని..కాకపోతే అధికారం ఒకరికే కాబట్టి టీడీపీ విజయం సాధించబోతోందని చెప్పారు.

ఇక జనసేనాని పవన్ కళ్యాణ్  సారథ్యంలోని  జనసేన కూడా కొన్ని చోట్ల గట్టి పోటి ఇచ్చిందని…ప్రస్తుతం జరిగిన ఎన్నికలు త్రిముఖ పోటీ అని రాజగోపాల్ అన్నారు.

ఎలక్షన్ మేనేంజ్‌మెంట్‌తో పాటు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం..తెలుగుదేశం 100 స్థానాలకు 10 సీట్లు తక్కువ లేదా ఎక్కువ రాబోతాయని తెలిపారు. వైసీపీ 72 సీట్లకు ఒక 7 సీట్లు తక్కువ లేదా ఎక్కువ రావొచ్చని తెలిపారు. ఇక మిగిలిన పార్టీలన్ని కలిపి 3 సీట్లకు 2 సీట్లు తక్కువ లేదా ఎక్కువ రావొచ్చని తెలిపారు.

అలాగే ఓటింగ్ శాతం విషయానికి వస్తే టీడీపీకి 43 శాతానికి 1 శాతం తక్కువ లేదా ఎక్కువ ఉండొచ్చని తెలిపారు. అలానే వైసీపీకి 41 శాతానికి కొంచెం అటు, ఇటుగా ఉంటుందని తెలిపారు. ఇక జనసేన 11 శాతానికి కొంచెం ఇంచుమించు తేడాలతో ఓటింగ్ షేర్ రాబడుతోందని తెలిపారు.

ఇక ఏపీలో పార్లమెంట్ సీట్ల విషయానికి వస్తే 15 సీట్లకు 2 స్థానాలు పెరిగొచ్చు లేదా తగ్గొచ్చని అన్నారు. వైసీపీ 10 సీట్లకు 2 సీట్లు పెరగొచ్చు లేదా తగ్గొచ్చని తెలిపారు. ఇక ఇతరులకు 1 సీటు రావొచ్చు లేదా రాకపోవచ్చని అన్నారు. చాలా లోతైనా అధ్యయనం చేసి సర్వే చేశామని తెలిపారు.  ఏపీలో నియోజకవర్గానికి 1200 శాంపిళ్లు లీసుకుని ఈ సర్వే నిర్వహించినట్టు తెలిపారు. అయితే 110 నుంచి 120 స్థానాల్లోనే శాంపిళ్లు సేకరించామని అన్నారు.