అలా చేసే ఎన్నికలకు వెళతాం.. సీఎం నోట ఎలెక్షన్ మాటెందుకో?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మత్స్యకారులకు ఆర్థిక సాయాన్ని గణనీయంగా పెంచడం వెనక సీక్రెట్ రివీల్ చేశారు ముఖ్యమంత్రి జగన్. మత్స్యకార భరోసా కింద వారందరికీ గతంలో ఇస్తున్న నాలుగు వేల రూపాయల స్థానంలో ప్రతి ఒక్కరికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రకటించిన కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళతామంటూ సీఎం సంచలన ప్రకటన చేశారు.

అలా చేసే ఎన్నికలకు వెళతాం.. సీఎం నోట ఎలెక్షన్ మాటెందుకో?
Follow us

|

Updated on: May 06, 2020 | 2:24 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మత్స్యకారులకు ఆర్థిక సాయాన్ని గణనీయంగా పెంచడం వెనక సీక్రెట్ రివీల్ చేశారు ముఖ్యమంత్రి జగన్. మత్స్యకార భరోసా కింద వారందరికీ గతంలో ఇస్తున్న నాలుగు వేల రూపాయల స్థానంలో ప్రతి ఒక్కరికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు. మొత్తం 1,09,234 మంది మత్స్యకారులకు లబ్ది చేకూరుతుందని ఆయన వివరించారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రకటించిన కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళతామంటూ సీఎం సంచలన ప్రకటన చేశారు.

రాష్ట్రంలో కొత్తగా ప్రారంభం కానున్న మత్స్యకార భరోసా కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తన సహచర మంత్రులు, అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం వివిధ జిల్లాల కలెక్టర్లు, ఇన్‌ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనాతో పోరాడుతున్న క్లిష్ట సమయంలో ఇబ్బందులు పడని సామాన్య ప్రజలు లేరని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఈ కష్ట సమయంలో మత్స్యకారులను ఆదుకునేందుకు మత్స్యకార భరోసా పేరిట పది వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు సీఎం వెల్లడించారు.

గతంలో చేపల వేటపై నిషేధం ఉన్న సమయంలో ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయలు మాత్రమే ఇచ్చేవారని, అది కూడా అందరికీ చేరేది కాదని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్క మత్స్యకారునికి పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం కరోనా కష్టకాలంలో రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు.

రాష్ట్రంలో మత్స్యకారుల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి వివరించారు రాష్ట్రంలో ఎనిమిది మేజర్ ఫిషింగ్ హార్బర్‌లను కట్టబోతున్నామని, ఒక ఫిష్ ల్యాండ్ కేంద్రాన్ని కూడా నిర్మిస్తామని ముఖ్యమంత్రి వివరించారు. ఇందుకోసం దాదాపు మూడువేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుందని చెప్పారు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తి అయ్యాకనే తాము ఎన్నికలకు వెళతామని జగన్ వ్యాఖ్యానించారు.

Latest Articles
పిఠాపురంలో ఎన్నికల ప్రచారం.. క్యాంపెయింగ్‎లో జగన్ కొత్త ట్రెండ్..
పిఠాపురంలో ఎన్నికల ప్రచారం.. క్యాంపెయింగ్‎లో జగన్ కొత్త ట్రెండ్..
పరశురాముడి గండ్రగొడ్డలి పాతిన ప్రదేశం తంగినాథ్ ధామ్ ఎక్కడ ఉందంటే
పరశురాముడి గండ్రగొడ్డలి పాతిన ప్రదేశం తంగినాథ్ ధామ్ ఎక్కడ ఉందంటే
నేటితో ముగియనున్న ప్రచారం.. పార్టీలు, అభ్యర్థులకు ఈసీ కీలక సూచనలు
నేటితో ముగియనున్న ప్రచారం.. పార్టీలు, అభ్యర్థులకు ఈసీ కీలక సూచనలు
17 ఏళ్ల తర్వాత పసికూనపై ఓడిన పాకిస్తాన్..
17 ఏళ్ల తర్వాత పసికూనపై ఓడిన పాకిస్తాన్..
బాబాయ్ కోసం రంగంలోకి అబ్బాయ్.. పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం
బాబాయ్ కోసం రంగంలోకి అబ్బాయ్.. పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం
ముంబైతో ఢీ కొట్టేందుకు కోల్‌కతా రెడీ.. గెలిస్తే ప్లే ఆఫ్స్ పక్కా
ముంబైతో ఢీ కొట్టేందుకు కోల్‌కతా రెడీ.. గెలిస్తే ప్లే ఆఫ్స్ పక్కా
కుప్పం నీదా.. నాదా.. చంద్రబాబు గెలుపుపై టీడీపీలో టెన్షన్..
కుప్పం నీదా.. నాదా.. చంద్రబాబు గెలుపుపై టీడీపీలో టెన్షన్..
చార్‌ధామ్ యాత్రకి IRCTC స్పెషల్ ప్యాకేజీ 12 రోజుల టూర్‌డీటైల్స్
చార్‌ధామ్ యాత్రకి IRCTC స్పెషల్ ప్యాకేజీ 12 రోజుల టూర్‌డీటైల్స్
మారిపోయిన స్నేహా ఉల్లాల్.. కొత్త ఫోటో వైరల్
మారిపోయిన స్నేహా ఉల్లాల్.. కొత్త ఫోటో వైరల్
అదా శర్మ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..
అదా శర్మ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!