AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పండుగపూట విషాదం..రావులపాలెం వద్ద యాక్సిడెంట్‌లో నలుగురి మృతి

ఈస్ట్ గోదావరి జిల్లా రావులపాలెం వద్ద పండుగ రోజు దారుణ రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొనడంతో..నలుగురు స్పాట్‌లో ప్రాణాలు కొల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు కారులో ఇరుక్కుపోవడంతో అతి కష్టంమీద వారిని బయటకు తీసి దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. చనిపోయినవారు విజయవాడకు చెందిన వారిగా సమాచారం అందుతోంది. వీరంతా పండక్కు పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం బంధువుల ఇంటికి వచ్చారని తెలుస్తోంది.  మూవీ చూడటానికి రావులపాలెం రాగా రిటన్ జర్నీలో […]

పండుగపూట విషాదం..రావులపాలెం వద్ద యాక్సిడెంట్‌లో నలుగురి మృతి
Ram Naramaneni
|

Updated on: Jan 15, 2020 | 7:03 PM

Share

ఈస్ట్ గోదావరి జిల్లా రావులపాలెం వద్ద పండుగ రోజు దారుణ రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొనడంతో..నలుగురు స్పాట్‌లో ప్రాణాలు కొల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు కారులో ఇరుక్కుపోవడంతో అతి కష్టంమీద వారిని బయటకు తీసి దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. చనిపోయినవారు విజయవాడకు చెందిన వారిగా సమాచారం అందుతోంది. వీరంతా పండక్కు పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం బంధువుల ఇంటికి వచ్చారని తెలుస్తోంది.  మూవీ చూడటానికి రావులపాలెం రాగా రిటన్ జర్నీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.యాక్సిడెంట్‌ వల్ల రోడ్డు పూర్తి బ్లాక్ అయ్యింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

ప్రమాదంలో కార్లు రెండు తునాతనరకలైపోయాయి. వాటి ఫోటోలను చూస్తేనే ప్రమాద తీవ్రత ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. విజయవాడ వైపు వెళ్తోన్న కారు ఓవర్ స్పీడ్‌తో డివైడర్ దాటి వచ్చి మరోవైపు వెళ్తున్న కారును ఢీకుంది. కాగా ప్రమాద కారణమైన కారులో ఉన్న వ్యక్తి మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.