AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్ : హీరోయిన్ రష్మిక ఇంటిపై ఐటీ సోదాలు

ప్రముఖ హీరోయిన్ రష్మిక మందానకు ఐటీ శాఖ షాకిచ్చింది. కర్నాటకలోని కొడగు జిల్లా విరాజ్‌పేటలోని రష్మిక ఇంట్లో ఐటీ శాఖ తనిఖీలు చేపట్టింది. ఆమె ఆదాయానికి సంబంధించి లెక్కలను పరిశీలిస్తున్నారు ఐటీ అధికారులు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా ఇటీవల విడుదలైన “సరిలేరు నీకెవ్వరు” చిత్రంలో హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నితిన్‌తో భీష్మా సినిమాలో నటిస్తోంది. ఇక అటు కన్నడలో పొగరు, తమిళంలో సుల్తాన్ చిత్రాల్లో నటిస్తూ.. చేతినిండా సినిమాలతో బిజీబిజీగా […]

బ్రేకింగ్ : హీరోయిన్ రష్మిక ఇంటిపై ఐటీ సోదాలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 16, 2020 | 2:43 PM

Share

ప్రముఖ హీరోయిన్ రష్మిక మందానకు ఐటీ శాఖ షాకిచ్చింది. కర్నాటకలోని కొడగు జిల్లా విరాజ్‌పేటలోని రష్మిక ఇంట్లో ఐటీ శాఖ తనిఖీలు చేపట్టింది. ఆమె ఆదాయానికి సంబంధించి లెక్కలను పరిశీలిస్తున్నారు ఐటీ అధికారులు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా ఇటీవల విడుదలైన “సరిలేరు నీకెవ్వరు” చిత్రంలో హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నితిన్‌తో భీష్మా సినిమాలో నటిస్తోంది. ఇక అటు కన్నడలో పొగరు, తమిళంలో సుల్తాన్ చిత్రాల్లో నటిస్తూ.. చేతినిండా సినిమాలతో బిజీబిజీగా ఉంది. ఇదిలావుంటే.. ఇవాళ మధ్యాహ్నం.. సరిలేరునీకెవ్వరు టీం సభ్యులతో రష్మిక తిరుపతి వెళ్లనుంది. రేపు వరంగల్‌లో సక్సెస్‌మీట్‌లో పాల్గొననుంది.

కాగా, రష్మిక ఇంటిపై జరుగుతున్న ఐటి దాడులపై ఆమె తరపు మేనేజర్ స్పందించారు. రష్మికకు సంబంధించిన ప్రతి లావాదేవీలు, బ్యాంక్ అకౌంట్ హైదరాబాద్‌లోనే ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం తన తండ్రికి ఉన్నా వ్యాపారలావాదేవీలపై విచారణ నడుస్తోందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా సినీ సెలబ్రిటీలే లక్ష్యంగా ఐటీ శాఖ దాడులు చేపడుతోంది. అనసూయ, సుమ, లావణ్య త్రిపాఠీతో సహా పలువురు టాలీవుడ్ ప్రముఖలపై ఐటీశాఖ వరుసగా దాడులు నిర్వహించింది.