AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాళ్లపై కన్నెర్ర చేసిన చంద్రబాబు

విజయవాడ: టీడీపీని వీడుతున్న నాయకుల పట్ల ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు కన్నెర్ర చేశారు. విజయనగరం జిల్లా పర్యాటనలో ఉన్న చంద్రబాబు పార్టీ నుంచి జంప్ చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లను చూసి నేను భయపడాలా? నేను వీళ్ల కోసం పని చేయాలా?, ప్రజల కోసం పని చేయాలా? అని ప్రశ్నించారు. అవకాశవాదులకు పార్టీలో చోటు లేదని, కొందరు పార్టీని వీడితే ఎలాంటి నష్టం లేదని అన్నారు. ప్రకాశం జిల్లా చీరాల నుంచి […]

వాళ్లపై కన్నెర్ర చేసిన చంద్రబాబు
Nikhil
| Edited By: Ram Naramaneni|

Updated on: Oct 18, 2020 | 10:52 PM

Share

విజయవాడ: టీడీపీని వీడుతున్న నాయకుల పట్ల ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు కన్నెర్ర చేశారు. విజయనగరం జిల్లా పర్యాటనలో ఉన్న చంద్రబాబు పార్టీ నుంచి జంప్ చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లను చూసి నేను భయపడాలా? నేను వీళ్ల కోసం పని చేయాలా?, ప్రజల కోసం పని చేయాలా? అని ప్రశ్నించారు. అవకాశవాదులకు పార్టీలో చోటు లేదని, కొందరు పార్టీని వీడితే ఎలాంటి నష్టం లేదని అన్నారు.

ప్రకాశం జిల్లా చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆ మరుసటి రోజే విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ కూడా టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఏపీలో ఫిరాయింపులు ఊపందుకున్నాయి.