కేంద్ర బడ్జెట్‌పై చంద్రబాబు ఒపినియన్

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర బడ్జెట్‌పై స్పందించారు. దేశ, ఏపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తాజా బడ్జెట్ లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులు, మహిళలు, యువత ఆశలు నెరవేర్చే దిశగా బడ్జెట్ లేదని అభిప్రాయపడ్డారు. వివిధ రంగాల అభివృద్ధికి, పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వలేదని, సామాన్య, మధ్య తరగతి పొదుపు శక్తి పెంచే దిశగా అంశాలు లేవని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలను పూర్తిగా విస్మరించారని […]

కేంద్ర బడ్జెట్‌పై చంద్రబాబు ఒపినియన్
Follow us

|

Updated on: Jul 05, 2019 | 7:27 PM

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర బడ్జెట్‌పై స్పందించారు. దేశ, ఏపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తాజా బడ్జెట్ లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులు, మహిళలు, యువత ఆశలు నెరవేర్చే దిశగా బడ్జెట్ లేదని అభిప్రాయపడ్డారు. వివిధ రంగాల అభివృద్ధికి, పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వలేదని, సామాన్య, మధ్య తరగతి పొదుపు శక్తి పెంచే దిశగా అంశాలు లేవని ఆయన అన్నారు.

ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలను పూర్తిగా విస్మరించారని అన్నారు.  అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్ లో కేటాయింపులు లేవని విమర్శించారు.  ఏపీకి ఇవ్వాల్సిన తొలి ఏడాది ఆర్థికలోటు భర్తీని ఇంకా తేల్చలేదని గుర్తు చేశారు. రూ.16 వేల కోట్ల లోటుకు గాను రూ.4 వేల కోట్లే ఇచ్చారని విమర్శించారు. విశాఖ, విజయవాడ మెట్రో, కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు గురించిన ప్రస్తావనే లేదని, తీవ్ర ఆర్థిక లోటు ఉన్న ఏపీని విస్మరించడం కేంద్రానికి తగదని చంద్రబాబు అన్నారు.

Latest Articles