Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడిలో పెళ్లి తంతు జరిపిస్తున్న పురోహితుడు.. వాష్‌రూమ్‌కి వెళ్లిన వధువు.. చివరికి

గుడిలో పెళ్లి తంతు జరిపిస్తున్న పురోహితుడు.. వాష్‌రూమ్‌కి వెళ్లిన వధువు.. చివరికి

Phani CH

|

Updated on: Jan 10, 2025 | 11:48 AM

గుడిలో బంధుమిత్రుల సమక్షంలో ఓ జంటకు వివాహం జరుగుతోంది. పూజారి వేదమంత్రాలు చదువుతూ వివాహ తంతు జరిపిస్తున్నారు. ఇంతలో వధువు వాష్‌ రూమ్‌కి వెళ్లింది. ఎంతకీ తిరిగి రాలేదు. దాంతో అందరూ కంగారు పడ్డారు. ముహూర్త సమయం దాటిపోతోంది. వధువు ఇంకా రావడం లేదేంటని వాష్‌ రూమ్‌ దగ్గరకు వెళ్లి చూసి షాకయ్యారు.

అసలు కథేంటంటే..యూపీలోని ఖాజ్ని ఏరియాకు చెందిన 40 ఏళ్ల వ్యక్తికి గతంలోనే వివాహం జరిగింది. అయితే, భార్య చనిపోవడంతో అతను మరో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మధ్యవర్తికి 30 వేలు ఇచ్చి ఓ సంబంధం చూడమన్నాడు. దాంతో అతను ఓ సంబంధం కుదిర్చాడు. వివాహ ఖర్చులు భరించడంతో పాటు వధువుకు నగలు చేయించేందుకు ఒప్పుకున్నాడు. అనుకున్న ముహూర్తానికి గుడిలో పెళ్లి ఏర్పాట్లు చేశాడు. వరుడు తన బంధువులందరినీ వివాహానికి ఆహ్వానించాడు. బంధుమిత్రులంతా పెళ్లికి హాజరయ్యారు. గుడిలో వధూవరులు ఇద్దరినీ పీటల మీద కూర్చోబెట్టి పూజారి పెళ్లి తంతు నిర్వహిస్తున్నాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇస్రో ప్రయోగం సక్సెస్‌.. ఇక అంతరిక్షంలోనూ వ్యవసాయం..

OYO: ప్రేమికులకు షాకిచ్చిన ఓయో.. ఈ కొత్త రూల్స్‌ ఫాలో అవ్వాల్సిందే

ప్రభుత్వ ఉద్యోగులకు 400% శాలరీ హైక్..