ఏపీ, తెలంగాణల మధ్య మరింత ముదిరిన వివాదం
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య డేటా చోరీ కేసు వివాదం మరింత ముదిరింది. రెండు రాష్ట్రాల అధికార పార్టీలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఈ వ్యవహారంపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని టీడీపీ నేతలంటుంటే.. తప్పు చేసిన టీడీపీ నేతలు తమను విమర్శించడం విడ్డూరంగా ఉందని టీఆర్ఎస్ ఎదురుదాడికి దిగుతోంది. డేటా చోరీ కేసులో సైబరాబాద్ పోలీసులకు అడ్డంగా దొరికి పోయింది ఐటీ గ్రిడ్ సంస్థ. ఏపీ ప్రభుత్వ డేటా సర్వర్ నుంచి మూడు కోట్ల మంది వ్యక్తిగత […]
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య డేటా చోరీ కేసు వివాదం మరింత ముదిరింది. రెండు రాష్ట్రాల అధికార పార్టీలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఈ వ్యవహారంపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని టీడీపీ నేతలంటుంటే.. తప్పు చేసిన టీడీపీ నేతలు తమను విమర్శించడం విడ్డూరంగా ఉందని టీఆర్ఎస్ ఎదురుదాడికి దిగుతోంది. డేటా చోరీ కేసులో సైబరాబాద్ పోలీసులకు అడ్డంగా దొరికి పోయింది ఐటీ గ్రిడ్ సంస్థ. ఏపీ ప్రభుత్వ డేటా సర్వర్ నుంచి మూడు కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని డౌన్లోడ్ చేసి హార్డ్ డిస్క్లో ఐటీ గ్రిడ్ సంస్థ సేవ్ చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
ఐటీ గ్రిడ్ సర్వర్ నుంచి సేవా మిత్ర యాప్కు మూడు కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని ఇంటిగ్రేట్ చేసినట్టు ఆధారాలు లభ్యమయ్యాయి. ప్రభుత్వ డేటాలోని వివరాలే సేవామిత్ర యాప్ ఉన్నట్లు సైబారాబాద్ పోలీసులు గుర్తించారు. సేవామిత్ర యాప్ డేటాను అమెజాన్ వెబ్ సర్వీసులో భద్రపర్చింది ఐటీ గ్రిడ్. కాగా.. డేటా చౌర్యం కేసులో ఐటీ గ్రిడ్ సంస్థ ఎండీ అశోక్ పై కూకట్ పల్లి, ఎస్సార్ నగర్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. అశోక్ కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. సెల్ ఫోన్ ఆధారంగా అశోక్ అమరావతిలో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.