మృత్యువుతో పోరాడి కన్నుమూసిన రవళి
హైదరాబాద్: ప్రేమోన్మాది చేతిలో పెట్రోల్ దాడికి గురై గత వారం రోజులుగా మృత్యువుతో పోరాడిన 22 సంవత్సరాల రవళి సోమవారం సాయింత్రం కన్నుమూసింది. ఫిబ్రవరి 27వ తేదీన రవళిని సికింద్రాబాద్లోని యశోదా ఆస్పత్రిలో చేర్చారు. పెట్రోల్ మంటలకు ఆమె శరీరం 70 శాతం కాలిపోయింది. నరాలు సహా పలు పలు అవయువాలు సైతం కలిపోయి తీవ్రం ఇబ్బంది తలెత్తింది. ఇన్ఫెక్షన్ సోకి కోలుకోవడం కష్టమైంది. ఊపిరితిత్తులు బాగా ఉబ్బిపోయి, శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. వెంటిలేటర్పై ఉంచి […]
హైదరాబాద్: ప్రేమోన్మాది చేతిలో పెట్రోల్ దాడికి గురై గత వారం రోజులుగా మృత్యువుతో పోరాడిన 22 సంవత్సరాల రవళి సోమవారం సాయింత్రం కన్నుమూసింది. ఫిబ్రవరి 27వ తేదీన రవళిని సికింద్రాబాద్లోని యశోదా ఆస్పత్రిలో చేర్చారు. పెట్రోల్ మంటలకు ఆమె శరీరం 70 శాతం కాలిపోయింది. నరాలు సహా పలు పలు అవయువాలు సైతం కలిపోయి తీవ్రం ఇబ్బంది తలెత్తింది. ఇన్ఫెక్షన్ సోకి కోలుకోవడం కష్టమైంది.
ఊపిరితిత్తులు బాగా ఉబ్బిపోయి, శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. వెంటిలేటర్పై ఉంచి ఆమెను కాపాడేందుకు వైద్యులు శతవిధాల ప్రయత్నించారు కానీ ఫలితం లేకపోయింది. మృత్యువుతో పోరాడిన ఆమె సోమవారం ఆమె కన్నుమూయడంతో పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మంగళవారం కుటుంభ సభ్యులకు అందించనున్నారు.
రవళి వరంగల్ జిల్లా హన్మకొండ రాంనగర్లోని వాగ్దేవి డిగ్రీ కాలేజీల్లో బీఎస్సీ ఫైనలియర్ చదువుతోంది. కాలేజీకి సమీపంలోని ఓ హాస్టల్లో ఉంటున్న ఆమె ఫిబ్రవరి 27న హాస్టల్ నుంచి స్నేహితులతో కలిసి కాలేజీకి వెళ్తుండగా, అదే కాలేజీలో బీకాం ఫైనలియర్ చదువుతున్న పెండ్యాల సాయి అన్వేష్ (24) ఆమెను అడ్డగించి పెట్రోల్ దాడి చేశాడు. వెంట తెచ్చుకున్న పెట్రోల్ను రవళిపై పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. చికిత్స కోసం రవళిని తొలుత వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి తరలించారు.