Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

16ఏళ్ల గురు మహాదశ.. ఆయా రాశులవారు మహా రాజులవుతారు.. వారికి పట్టిందల్లా బంగారమే…

దేవగురువును సంపద, ఐశ్వర్యం, సౌలభ్యం అంశంగా పరిగణిస్తారు. జ్యోతిష్యంలో బృహస్పతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. బృహస్పతి రాశిలో మార్పు ప్రభావం మొత్తం 12 రాశుల మీద కనిపిస్తుంది.

16ఏళ్ల గురు మహాదశ.. ఆయా రాశులవారు మహా రాజులవుతారు.. వారికి పట్టిందల్లా బంగారమే…
Zodiac Sign
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 28, 2023 | 1:46 PM

జ్యోతిషశాస్త్రం ప్రకారం..ప్రతి గ్రహం కదలిక, సంకేతాల మార్పు ముఖ్యమైనవి. అయితే, కొన్ని గ్రహ మార్పులు శుభ, అశుభ పరిస్థితులను సృష్టిస్తాయి. ఈ పరిస్థితి వారి వారి జాతకంలో గ్రహాల బలం, బలహీనతపై ఆధారపడి ఉంటుంది. మనం బృహస్పతి గురించి తెలుసుకున్నట్టయితే..బృహస్పతి..అన్ని గ్రహాలకు అధిపతిగా పిలుస్తారు.  దేవగురువును సంపద, ఐశ్వర్యం, సౌలభ్యం అంశంగా పరిగణిస్తారు. జ్యోతిష్యంలో బృహస్పతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. బృహస్పతి రాశిలో మార్పు ప్రభావం మొత్తం 12 రాశుల మీద కనిపిస్తుంది.

బృహస్పతి దేవతల గురువు ఆయన అనుగ్రహంతో జ్ఞానం పెరుగుతుంది. రాశిచక్రంలో బృహస్పతి మార్పు అనేక రాశులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎవరి జాతకంలో బృహస్పతి బాగా ఉందో వారు ఆకర్షణీయంగా ఉంటారు. ఈ వ్యక్తులు ప్రశాంతంగా ఉంటారు. ఎక్కువ జ్ఞానం కలిగి ఉంటారు. ఉన్నత విద్యను పొందుతారు. జాతకంలో బృహస్పతి బాగా ఉన్నట్లయితే, వారి వృత్తిలో చాలా ప్రయోజనాలను పొందుతారు. ఈ వ్యక్తులు జీవితంలో ఎప్పుడూ డబ్బు కొరతను చూడరు. మరోవైపు, అటువంటి వ్యక్తి జీవితంలో బృహస్పతి మహాదశ ప్రారంభమైనప్పుడు, వారు మరింత పురోగతి, గౌరవం, సంపద, దాంపత్య సంతోషం పొందుతారు.

అంతేకాదు ఎవరి జాతకంలో బృహస్పతి అశుభ స్థానంలో ఉందో అలాంటి వారు జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ వ్యక్తులు తమ కెరీర్‌లో చాలా కష్టపడాల్సి వస్తుంది. మరోవైపు, అటువంటి వ్యక్తి జీవితంలో బృహస్పతి మహాదశ కొనసాగినప్పుడు అనేక సమస్యలు తలెత్తుతాయి. వైవాహిక జీవితంలో అనేక రకాల అడ్డంకులు రావడం ప్రారంభిస్తాయి. ఆరోగ్యం కూడా క్షీణించడం ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

ఒక వ్యక్తి జాతకంలో బృహస్పతి బలహీనంగా, అశుభంగా ఉంటే, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి చాలా పరిష్కారాలు ఉన్నాయి. అలాంటి వారు గురువారం ఉపవాసం పాటించాలి. ఈ రోజున పసుపు మిఠాయిలు, పసుపుతో చేసిన ఏదైనా శుభప్రదంగా భావిస్తారు. విష్ణువును పూజించినా బృహస్పతి బలపడతాడు. నీళ్లలో పసుపు వేసి తలస్నానం చేయాలి. గురువారం నాడు పసుపు, బెల్లం, శనగలు సమర్పించి అరటి మొక్కకు పూజ చేయాలి. బృహస్పతి గురువారాల్లో శనగలు, అరటిపండు, పసుపు మిఠాయిలను అవసరమైన వారికి దానం చేయడం ద్వారా బలపడుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..