Andhra Pradesh: వైఎస్సార్ బీమా పథకానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారా..? అప్పుడే లాస్ట్ డేట్
కుటంబాన్ని పోషించే వ్యక్తి సహజంగా లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి అందించే వైఎస్సార్ బీమా పథకం నమోదు ప్రక్రియ ప్రారంభమయ్యింది. మే 29న నమోదు ప్రక్రియ ప్రారంభం కాగా.. గ్రామ, వార్డు సచివాలయాల్లో వాలంటీర్లు వివరాలను నమోదు చేస్తున్నారు.
కుటంబాన్ని పోషించే వ్యక్తి సహజంగా లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి అందించే వైఎస్సార్ బీమా పథకం నమోదు ప్రక్రియ ప్రారంభమయ్యింది. మే 29న నమోదు ప్రక్రియ ప్రారంభం కాగా.. గ్రామ, వార్డు సచివాలయాల్లో వాలంటీర్లు వివరాలను నమోదు చేస్తున్నారు. ఈ నెల 7లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. అయితే 2023-24 కు సంబంధించి జులై 1న వైస్సార్ బీమా పథకం అమలుకు కార్మిక శాఖ ఉత్తర్వులిచ్చింది. ఈ బీమా కింద 18-50 ఏళ్ల మధ్యలో కుటుంబాన్ని పోషించే పెద్ద సహజంగా మరణిస్తే వారికి రూ.లక్ష పరిహారంగా అందజేస్తారు. అలాగే 18-70 ఏళ్లు లోపు ఉన్నవారు ప్రమాదవశాత్తు మరణించడం లేదా శాశ్వత వైకల్యం కలిగినా ఆ కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం చెల్లిస్తారు.
బీమా కంపెనీలు, బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా గ్రామ,వార్డు సచివాలయాల ద్వారానే ప్రభుత్వం ఈ పరిహారం అందించనుంది. ఈ పథకం కోసం రూ.372 కోట్లు కేటాయించింది. ఇదిలా ఉండగా వైస్సార్ బీమా పథకాన్ని సీఎం జగన్ 2021 జులై1 ప్రారంభించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..