AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YSR Matsyakara Bharosa: గుడ్‌న్యూస్‌..మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో రూ.231 కోట్లు జమ.. ఒక్కో అకౌంట్‌లో రూ.10వేలు

ఈ సందర్బంగా సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వంలో రూ. 4వేలు.. అది కూడా కేవలం కొందరికి మాత్రమే అందేదని చెప్పారు. చంద్రబాబు ఐదేళ్లలో ఇచ్చింది కేవలం రూ.104 కోట్లు మాత్రమేనని చెప్పారు. మన ప్రభుత్వంలో ఒక్క ఏడాదిలోనే రూ. 231 కోట్లు ఇస్తున్నామన్నారు.

YSR Matsyakara Bharosa: గుడ్‌న్యూస్‌..మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో రూ.231 కోట్లు జమ.. ఒక్కో అకౌంట్‌లో రూ.10వేలు
Andhra CM Jagan Reddy
Jyothi Gadda
|

Updated on: May 16, 2023 | 12:27 PM

Share

Ysr Matsyakara Bharosa Scheme: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర మత్స్యకారులకు గొప్ప శుభవార్తనందించింది. వైఎస్సార్‌ మత్స్యాకార భరోసా నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. బాపట్లలోని నిజాంపట్నంలో సీఎం జగన్ వైఎస్సార్‌ మత్స్యాకార భరోసా నిధులను మత్స్యకారుల ఖాతాల్లో జమ చేశారు. మొత్తం 1,23,519 మంది మత్స్యకార కుటుంబాలకు మత్స్యకార భరోసా కింద రూ.123.52 కోట్లతో పాటు ఓఎన్‌జీసీ పైపులైన్‌ ఏర్పాటుతో జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది మత్స్యకారులకు కూడా రూ.108 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ జమ చేశారు. వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కింద వేట నిషేధ భృతిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లుగా ఆర్థిక సాయం అందిస్తోంది. కాగా ఇప్పటి వరకు లబ్ధిదారులకు రూ.538 కోట్ల సాయం అందజేయడం జరిగింది. ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ. 10వేల చొప్పున సాయం అందిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఓఎన్‌జీసీ పైపులైన్‌ ఏర్పాటుతో జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది మత్స్యకారులకు రూ.108 కోట్ల ఆర్థిక సాయం అందించింది.

ఈ మేరకు బాపట్ల జిల్లా నిజాంపట్నంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ఈ సాయాన్ని జయచేశారు.. మొత్తం 1,23,519 మంది మత్స్యకార కుటుంబాలకు మత్స్యకార భరోసా కింద రూ.123.52 కోట్లతో పాటు ఓఎన్‌జీసీ పైపులైన్‌ ఏర్పాటుతో జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది మత్స్యకారులకు కూడా రూ.108 కోట్ల ఆర్థిక సాయాన్ని జమచేయనున్నారు.

ఈ సందర్బంగా సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వంలో రూ. 4వేలు.. అది కూడా కేవలం కొందరికి మాత్రమే అందేదని చెప్పారు. చంద్రబాబు ఐదేళ్లలో ఇచ్చింది కేవలం రూ.104 కోట్లు మాత్రమేనని చెప్పారు. మన ప్రభుత్వంలో ఒక్క ఏడాదిలోనే రూ. 231 కోట్లు ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడా గమనించాలన్నారు. గతంలో 1100 బోట్లు, ఇప్పుడు 20వేల బోట్లకు సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు. గతంలో డీజిల్‌పై రూ.6 ఇస్తే.. ఇప్పుడు రూ.9 సబ్సిడీ ఇస్తున్నామని సీఎం జగన్‌ వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..