AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Sharmila: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు వైఎస్ షర్మిల ఫిర్యాదు, కారణమిదే..!

వైసీపీ కార్యకర్తలు తప్పుడు ప్రచారం చేసి తన పరువుకు భంగం కలిగిస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫిర్యాదు చేశారు. దీంతో షర్మిల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనపై పోస్టులు

YS Sharmila: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు వైఎస్ షర్మిల ఫిర్యాదు, కారణమిదే..!
YS Sharmila
Balu Jajala
|

Updated on: Feb 25, 2024 | 12:40 PM

Share

వైసీపీ కార్యకర్తలు తప్పుడు ప్రచారం చేసి తన పరువుకు భంగం కలిగిస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫిర్యాదు చేశారు. దీంతో షర్మిల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనపై పోస్టులు, యూట్యూబ్ వీడియోలతో సహా అభ్యంతరకరమైన కంటెంట్ తో కావాలనే తనను టార్గెట్ చేశారని షర్మిల ఆరోపించారు. ఈ నెగెటివ్ సోషల్ మీడియా పోస్టులు తన ఇమేజ్ ను డ్యామేజ్ చేయడమేనని, ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమైతే మరింత పరువునష్టం దావా వేస్తానని ఆమె పేర్కొన్నారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని షర్మిల పోలీసులను కోరారు.

కాగా పొత్తులపై షర్మిల రియాక్ట్ అయ్యింది. రాష్ట్ర ప్రజలకు న్యాయం కోసం తమ పార్టీ చేస్తున్న పోరాటం కోసం వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునేందుకు రెండు ప్రాంతీయ పార్టీలు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయని, టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు రాష్ట్ర ప్రజలను మోసం చేశాయని షర్మిల అన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాల్సిన అవసరం ఉందని, ఇలాంటి దుష్ట శక్తులను ఓడించేందుకు కమ్యూనిస్టు పార్టీలతో కాంగ్రెస్ చేతులు కలిపిందన్నారు.

ఇక సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడారు. రాష్ట్రంలో 1% ఓటు షేర్ కూడా లేని బిజెపి పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను పాలిస్తోందని, దీనికి టిడిపి, వైసిపిల అసమర్థతే కారణమన్నారు. జగన్-బాబు-పవన్ త్రయం బీజేపీ చేతిలో ఆడుకుంటోందని, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను కేంద్రంతో రాజీ చేసిందని ఆరోపించారు. ప్రజల ఆర్థిక సమస్యల గురించి ఆలోచించకుండా విచక్షణారహితంగా అప్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ను దివాళా తీసే స్థితికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నెట్టారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోసం పోరాడుతున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు.