AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Sharmila: ఏపీలోనే కాదు అండమాన్‌లోనైనా పనిచేస్తా.. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..

వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరారు. వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసి వైఎస్ షర్మిల.. కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్టీపీని విలీనం చేసి పార్టీలో చేరిన షర్మిలను కాంగ్రెస్ నేతలు రాహుల్, ఖర్గే ఆహ్వానించారు. అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడారు.

YS Sharmila: ఏపీలోనే కాదు అండమాన్‌లోనైనా పనిచేస్తా.. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..
YS Sharmila
Shaik Madar Saheb
|

Updated on: Jan 04, 2024 | 1:52 PM

Share

వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరారు. వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసి వైఎస్ షర్మిల.. కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్టీపీని విలీనం చేసి పార్టీలో చేరిన షర్మిలను కాంగ్రెస్ నేతలు రాహుల్, ఖర్గే ఆహ్వానించారు. అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు సంతోషంగా ఉందన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద సక్యులర్ పార్టీ అని పేర్కొన్నారు. దేశంలో అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఎటువంటి బాధ్యతలు ఇచ్చిన నిర్వర్తిస్తానని స్పష్టంచేశారు. ఏపీలోనే కాదు అండమాన్‌లోనైనా పనిచేస్తా అంటూ.. వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

ఈరోజు వైఎస్ఆర్టీపీను కాంగ్రెస్‌లో విలీనం చేయండం సంతోషంగా ఉందన్న షర్మిల.. వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో గొప్ప నేత అంటూ కొనియాడారు..ఆయన ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలూ శ్రమించారన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ అని.. అన్ని వర్గాలను కలుపుకుంటూ, అందరినీ కలుపుతూ పని చేస్తుందన్నారు. ఒక క్రిస్టియన్ గా మణిపూర్ లో చర్చిల కూల్చివేత తనను తీవ్రంగా బాధించిందన్నారు. సెక్యులర్ పార్టీ అధికారంలో లేకపోతే ఏం జరుగుతుంది అనడానికి ఇదొక నిదర్శనమంటూ షర్మిల పేర్కొన్నారు.

భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీపై నమ్మకాన్ని తనతో పాటు ప్రజలందరిలో పెంచిందని షర్మిల పేర్కొన్నారు. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ కి మద్దతు ప్రకటించి పోటీ చేయలేదన్నారు. రాహుల్ గాంధీ నీ ప్రధానిగా చూడాలన్నది తన తండ్రి అశయమని.. దానికి అనుగుణంగా పనిచేస్తానని పేర్కొన్నారు.

కాగా.. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత షర్మిల, అనిల్ దంపతులు సోనియా గాంధీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us