నిప్పుల కొలిమిని తలపిస్తోన్న ఏపీ, తెలంగాణ ప్రాంతాలు.. వేడి, ఉక్కపోతతో అల్లాడుతున్న జనం

మే నెల వచ్చేసింది.. తెలుగు రాష్ట్రాల్లో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఇప్పటికే.. పలుచోట్ల 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. మరో మూడు రోజుల పాటు రికార్డ్‌స్థాయి టెంపరేచర్స్‌ నమోదు అవుతాయని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ. అంతేకాదు ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దు అన్ని సూచిస్తోంది. 

నిప్పుల కొలిమిని తలపిస్తోన్న ఏపీ, తెలంగాణ ప్రాంతాలు.. వేడి, ఉక్కపోతతో అల్లాడుతున్న జనం
Heat Waves
Follow us

|

Updated on: May 03, 2024 | 7:12 AM

మే వచ్చేసింది.. మాడు పగిలిపోతోంది.. బయటికెళ్తే ఎండ వేడితో నెత్తి చుర్రుమంటోంది. వడగాలులు, ఉక్కపోత ఠారెత్తిస్తున్నాయ్‌. అప్పుడే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక.. భానుడి భగభగలతో ఏపీ, తెలంగాణలోని పలుప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. గత పదేళ్లలో ఎప్పుడూ నమోదు కానంత స్థాయిలో ఎండలు కాస్తుండడంతో కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. కొన్ని జిల్లాల్లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు బయటికి రావాలంటనే బయపడుతున్నారు. సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు, మరోవైపు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. ఇది చాలదన్నట్లు.. మరో మూడు రోజులు ఎండలు మరింత పెరగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

ప్రధానంగా.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని హెచ్చరిస్తోంది. అటు.. ఏపీ కూడా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప, తిరుపతి జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

పెరిగిన ఉష్ణోగ్రతలు, వేడి, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నట్లు వాతావరణ శాఖ సూచించింది. దాంతో.. 11 నుండి 4 గంటల వరకు ఇంట్లోంచి బయటకు రావొద్దని హెచ్చరిస్తోంది. పల్నాడు జిల్లా కొప్పునూరు, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. చాలా చోట్ల 45 డిగ్రీలపైనే టెంపరేచర్స్‌ రికార్డ్‌ అవుతున్నాయి. ఇక.. రాయలసీమ, కోస్తాంధ్రలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే.. ఈ వేడి వాతావరణానికి కాలుష్యం, తత్ఫలితంగా జరుగుతున్న వాతావరణ మార్పులే కారణమని చెప్తున్నారు వాతావరణ శాఖ నిపుణులు. మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్