AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: ఎమ్మెల్సీ ఎన్నిక.. వేడెక్కిన సాగరతీరం.. జగన్ రిక్వెస్ట్ ఇదే…

విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుపే లక్ష్యంగా కూటమి, వైసీపీ వ్యూహాలు రచిస్తున్నాయి. వైసీపీ స్థానిక సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న జగన్‌.. టీడీపీ ప్రలోభాలకు లొంగొద్దని సూచించారు. బొత్సను గెలిపించాలని కోరారు.

Vizag: ఎమ్మెల్సీ ఎన్నిక.. వేడెక్కిన సాగరతీరం.. జగన్ రిక్వెస్ట్ ఇదే...
YS Jagan
Ram Naramaneni
|

Updated on: Aug 07, 2024 | 5:45 PM

Share

విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై అధికార టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి, ప్రతిపక్ష వైసీపీ స్పెషల్‌ ఫోకస్ పెట్టాయి. ఎలాగైనా గెలిచి తీరాలని… వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును ప్రకటించారు వైసీపీ అధినేత జగన్‌. ఎమ్మెల్సీ స్థానం గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న వైసీపీ అధినేత.. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రతినిధులతో తాడేపల్లి పార్టీ కార్యాయలంలో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికలో టీడీపీ ప్రలోభాలకు లొంగొద్దని వైసీపీ స్థానిక సంస్థల ప్రతినిధులకు జగన్ సూచించారు. టీడీపీకి తగిన సంఖ్యా బలం లేకపోయినా పోటీ చేస్తోందని.. నైతిక విలువలు ఉన్న రాజకీయ పార్టీ అయితే అసలు పోటీ పెట్టకూడదన్నారు. వైసీపీ ప్రతినిధులను చంద్రబాబు డబ్బుతో ప్రలోభపెట్టాలని చూస్తున్నారని జగన్ విమర్శించారు. YCPకి 380పైచిలుకు ఓట్ల ఆధిక్యత ఉందని తెలిసినా టీడీపీకి పోటీకి దిగుతోందన్నారు. విలువులు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలే చిరస్థాయిగా ఉంటాయని.. ఇవి వదులుకున్నప్పుడు ప్రజలకే కాదు, మన ఇంట్లో కూడా మనకు విలువ తగ్గుతుందన్నారు. ఈ ఐదేళ్ల పోరాటంలో మీ సహాయ సహకారాలు ఉండాలని.. బొత్స సత్యనారాయణను గెలిపించాలని కోరారు జగన్.

మరోవైపు టీడీపీ కూడా అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది. వైసీపీకి సంఖ్య పరంగా బలం ఉన్నా.. కూటమి నేతలు గెలుపు కోసం ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ నివాసంలో జరిగిన భేటీకి అరకు, పాడేరు నుంచి 60 మంది వైసీపీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు హాజరయ్యారు. మరికొంతమందిని టచ్‌లోకి తెచ్చుకునే వ్యూహాల్లో ఉన్నారు కూటమి నేతలు. పోటాపోటీ సమావేశాలతో సాగర తీరం కేంద్రంగా రాజకీయం వేడెక్కింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

మెస్సీ కోల్‌కతా పర్యటన.. కోర్టు మెట్లెక్కిన భారత మాజీ కెప్టెన్
మెస్సీ కోల్‌కతా పర్యటన.. కోర్టు మెట్లెక్కిన భారత మాజీ కెప్టెన్
కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే.. 6 బంతుల్లో ఉతికారేసిన బౌలర్..
కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే.. 6 బంతుల్లో ఉతికారేసిన బౌలర్..
మరో 2రోజుల్లో తెలంగాణ సెట్ 2025 పరీక్షలు.. హాల్ టికెట్ల లింక్ ఇదే
మరో 2రోజుల్లో తెలంగాణ సెట్ 2025 పరీక్షలు.. హాల్ టికెట్ల లింక్ ఇదే
ఈ సారి తేడా కొట్టిందో డీజే మోతే.. అంతటా డేగ కన్ను
ఈ సారి తేడా కొట్టిందో డీజే మోతే.. అంతటా డేగ కన్ను
ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు..
ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు..
కొత్త బీమా సవరణ బిల్లు 2025కే ఆమోదం!
కొత్త బీమా సవరణ బిల్లు 2025కే ఆమోదం!
కేకేఆర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 9.2 కోట్ల ప్లేయర్..
కేకేఆర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 9.2 కోట్ల ప్లేయర్..
నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 షురూ.. టైమింగ్స్ ఇవే!
నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 షురూ.. టైమింగ్స్ ఇవే!
ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ మూవీ హోమ్‌బౌండ్ ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ మూవీ హోమ్‌బౌండ్ ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
నిధి అగర్వాల్‌తో అనుచిత ప్రవర్తన.. వారిపై పోలీస్ కేసులు నమోదు
నిధి అగర్వాల్‌తో అనుచిత ప్రవర్తన.. వారిపై పోలీస్ కేసులు నమోదు