Black magic murder: విశాఖ ఏజెన్సీలో మూఢ నమ్మకం ఒక అమాయక ప్రాణాన్ని బలిగొంది

విశాఖ ఏజెన్సీలో మూఢనమ్మకం ఒక అమాయక ప్రాణాన్ని బలిగొంది. చేతబడి చేస్తున్నాడనే నెపంతో ఓ గిరిజనుడిని దారుణంగా కొట్టి చంపేశారు కొందరు గ్రామస్తులు.

Black magic murder: విశాఖ ఏజెన్సీలో మూఢ నమ్మకం ఒక అమాయక ప్రాణాన్ని బలిగొంది
Black Magic
Follow us

|

Updated on: Oct 21, 2021 | 1:24 PM

Black magic murder: విశాఖ ఏజెన్సీలో మూఢనమ్మకం ఒక అమాయక ప్రాణాన్ని బలిగొంది. చేతబడి చేస్తున్నాడనే నెపంతో ఓ గిరిజనుడిని దారుణంగా కొట్టి చంపేశారు కొందరు గ్రామస్తులు. డుంబ్రిగూడ మండలం తూటంగి పంచాయతీ ఇసుకలు గ్రామంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే, విశాఖ ఏజెన్సీలోని మారుమూల గ్రామమిది. డుంబ్రిగూడ మండలం తూటంగి పంచాయతీ ఇసుకలు గ్రామంలో కేవలం 20 కుటుంబాలు మాత్రమే నివాసం ఉంటున్నాయి. అంతా పిటిజి తెగకు చెందిన గిరిజనులే.

20 గడపల్లో నివసిస్తున్న కుటుంబాలు కూడా దగ్గర బంధువులు. అయితే.. ఆ గ్రామంలో గత కొంత కాలంగా కొందరు మృతిచెందారు. చేతబడి కారణంగానే ఈ మరణాలు సంభవిస్తున్నాయన్న అంధవిశ్వాసం ఆ గిరిజనుల కళ్ళను కమ్మేసింది. చేతబడికి మూల కారణం 40 ఏళ్ల కిలో కళ్యాణ అని వారిలో వారే నిర్ణయించుకున్నారు. పాత కక్షల కూడా తోడవడంతో.. ఇక ఆ ప్రాంతంలో కళ్యాణ పై కక్ష పెంచుకున్నారు. ఎలాగైనా కల్యాణ ను వదిలించుకోవాలని ప్లాన్ చేశారు. పొలం పనులకు తన కొడుకుతో పాటు వెళ్తున్న కిలో కళ్యాణ ను అడ్డగించారు కొంతమంది.

అక్కడే తోటి గిరిజనం అంతా కళ్యాణతో వాగ్వాదానికి దిగి.. తమతో తెచ్చిన మారణాయుధాలతో కళ్యాణ పై దాడి చేశారు. కళ్ళముందే కళ్యాణ ను అతి దారుణంగా చంపేశారని కొడుకు రాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. భార్య లక్ష్మి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. కళ్యాణ హత్యతో పరిసర గ్రామాలన్నీ ఉలిక్కిపడ్డాయి. మూఢ నమ్మకమే కళ్యాణ ప్రాణం తీసింది అని అంటున్నారు సర్పంచ్ సుబ్బారావు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కళ్యాణ ను హత్య లో పాల్గొన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు.

ఖాజా, టీవీ9 ప్రతినిధి, వైజాగ్