జ్యోతి డెడ్బాడీకి రీ పోస్టుమార్టం
గుంటూరు: జిల్లాలో సంచలనం రేపిన ప్రేమజంటపై దాడి కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. పథకం ప్రకారమే తమ కుమార్తెను చంపారని జ్యోతి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆమె మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. తాడేపల్లి ఇన్ఛార్జ్ తహశీల్దారుతో పాటు అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ సమక్షంలో జ్యోతి డెడ్బాడీకి రీ పోస్టుమార్టం జరగనుంది. మొదటి రిపోర్టు, రెండో రిపోర్టులో తేడాలు ఉంటే పోలీసుల రియాక్షన్ ఏంటి అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మరోవైపు ఈ దాడిలో తీవ్రంగా […]
గుంటూరు: జిల్లాలో సంచలనం రేపిన ప్రేమజంటపై దాడి కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. పథకం ప్రకారమే తమ కుమార్తెను చంపారని జ్యోతి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆమె మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. తాడేపల్లి ఇన్ఛార్జ్ తహశీల్దారుతో పాటు అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ సమక్షంలో జ్యోతి డెడ్బాడీకి రీ పోస్టుమార్టం జరగనుంది. మొదటి రిపోర్టు, రెండో రిపోర్టులో తేడాలు ఉంటే పోలీసుల రియాక్షన్ ఏంటి అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
మరోవైపు ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ జ్యోతి ప్రేమికుడు శ్రీనివాస్ ఇంకా కోలుకోలేదు. అతడు కోలుకుని వివరాలు చెబితే తప్ప ఈ కేసులో విచారణ ముందుకు కదిలేలా కనిపించడం లేదు. తమపై దాడి జరిగిందని శ్రీనివాస్ చెప్పిన నేపథ్యంలో.. గతంలో ఇలాంటి దాడులకు పాల్పడిన దుండగుల హిస్టరీ బయటకు తీస్తున్నారు. ఇటు అతని స్నేహితుల వివరాలు కూడా పోలీసులు బయటకు లాగుతున్నారు.