AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్: పోలీసుల ఎఫ్‌ఐఆర్‌లో ఏముందంటే..!

దిశ హత్యాచారం కేసులో నిందితులను ఎందుకు కాల్చి చంపాల్సి వచ్చిందో ఎఫ్‌ఐఆర్‌లో తెలిపారు పోలీసులు. ఈ ఎన్‌కౌంటర్‌పై షాద్ నగర్ ఏసీపీ సురేందర్ ఫిర్యాదు చేయగా.. దానికి వివరణ ఇస్తూ వారు ఎఫ్‌ఐఆర్‌ను విడుదల చేశారు. అందులో ఉన్న వివరాల ప్రకారం దిశ కేసు రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, శివ, చెన్నకేశవులను ఈ నెల 6న చర్లపల్లి జైలు నుంచి హత్య జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లాం. అక్కడ నిందితుల నుంచి బాధితురాలి […]

దిశ నిందితుల ఎన్‌కౌంటర్: పోలీసుల ఎఫ్‌ఐఆర్‌లో ఏముందంటే..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 13, 2019 | 2:48 PM

Share

దిశ హత్యాచారం కేసులో నిందితులను ఎందుకు కాల్చి చంపాల్సి వచ్చిందో ఎఫ్‌ఐఆర్‌లో తెలిపారు పోలీసులు. ఈ ఎన్‌కౌంటర్‌పై షాద్ నగర్ ఏసీపీ సురేందర్ ఫిర్యాదు చేయగా.. దానికి వివరణ ఇస్తూ వారు ఎఫ్‌ఐఆర్‌ను విడుదల చేశారు. అందులో ఉన్న వివరాల ప్రకారం దిశ కేసు రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, శివ, చెన్నకేశవులను ఈ నెల 6న చర్లపల్లి జైలు నుంచి హత్య జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లాం. అక్కడ నిందితుల నుంచి బాధితురాలి వస్తువులను రికవరీ చేయడం కోసం చటాన్‌పల్లికి తీసుకొచ్చాం. అయితే ఉదయం గం.6.10ని.ల సమయంలో నిందితులు ఒక్కసారిగా పోలీసులపై తిరగబడ్డారు. ఆయుధాలు లాక్కొని పోలీసులను హతమార్చాలని చూశారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపగా నిందితులు చనిపోయారు అని పోలీసులు వెల్లడించారు. ఇక ఎఫ్‌ఐఆర్‌లో నిందితుల వయస్సు 19ఏళ్లని కూడా వివరణ ఇచ్చారు. అయితే ఎన్‌కౌంటర్ తరువాత పోలీసులు మాట్లాడుతూ నిందితుల వయస్సు 20 సంవత్సరాలని పేర్కొన్న విషయం తెలిసిందే.