Breaking: ఏపీలో క్వారంటైన్‌ విధానంలో మార్పులు

ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి క్వారంటైన్ విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. విదేశాల నుంచి ఏపీకి వచ్చేవారికి 14 రోజుల క్వారంటైన్‌ని 7 రోజులకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది.

Breaking: ఏపీలో క్వారంటైన్‌ విధానంలో మార్పులు
Follow us

| Edited By:

Updated on: Jul 14, 2020 | 10:40 AM

ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి క్వారంటైన్ విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. విదేశాల నుంచి ఏపీకి వచ్చేవారికి 14 రోజుల క్వారంటైన్‌ని 7 రోజులకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. వారికి 5వ రోజు, 7 రోజున కరోనా టెస్ట్‌లు చేయాలని అధికారులను ఆదేశించింది. ఇక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విమానంలో వచ్చే వారికి ర్యాండమ్‌గా పరీక్షలు నిర్వహించాలని, విమానాశ్రయాల్లోనే స్వాబ్ టెస్టులు చేయాలని ప్రభుత్వం సూచించింది. వారికి 14 రోజుల హోమ్ క్వారంటైన్ వెసులుబాటు కల్పించాలని వెల్లడించింది. ఇక రైళ్ల ద్వారా రాష్ట్రానికి వచ్చే వారిలోనూ ర్యాండమ్‌గా టెస్టులు చేయాలని.. వారికి 14 రోజుల హోమ్ క్వారంటైన్ తప్పనిసరి చేయాలని తెలిపింది.

రోడ్డు మార్గం ద్వారా రాష్ట్రంలోకి వచ్చే వారి కోసం బోర్డర్ చెక్ పోస్టుల వద్దే స్వాబ్ టెస్టులు చేయాలని వెల్లడించింది. తెలంగాణ, కర్ణాటక మినహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులను 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా ఏపీకి వచ్చేందుకు స్పందన యాప్ ద్వారా  ఈ-పాస్‌కి దరఖాస్తు చేసి అనుమతి తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఇక రాష్ట్ర సరిహద్దుల వద్ద కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తులను తక్షణమే కరోనా ఆస్పత్రులకు తరలించాలని సూచించింది. హోమ్ క్వారంటైన్ చేసిన వ్యక్తుల కదలికల కోసం ఏఎన్ఎంలు, గ్రామ వార్డు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలని వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌. జవహర్ రెడ్డి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ ఉత్తర్వుల్లో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను హైరిస్క్‌ ప్రాంతాలుగా ప్రకటించింది ప్రభుత్వం.

నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఐపీఎల్ టాప్-2 స్కోర్ల మ్యాచుల్లో ఆడిన ఏకైక ఆటగాడు ఎవరంటే?
ఐపీఎల్ టాప్-2 స్కోర్ల మ్యాచుల్లో ఆడిన ఏకైక ఆటగాడు ఎవరంటే?
కలలో బంగారం కనిపించిందా.? దాని అర్థం ఏంటంటే..
కలలో బంగారం కనిపించిందా.? దాని అర్థం ఏంటంటే..
ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండాలా.. ఈ మంత్రాలను పఠించండి..
ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండాలా.. ఈ మంత్రాలను పఠించండి..
రామ్ చరణ్ బర్త్ డే రోజున ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?
రామ్ చరణ్ బర్త్ డే రోజున ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?
స్విగ్గీ వన్ లైన్ సబ్‌స్క్రిప్షన్‌తో జియో నయా ప్లాన్‌ లాంచ్
స్విగ్గీ వన్ లైన్ సబ్‌స్క్రిప్షన్‌తో జియో నయా ప్లాన్‌ లాంచ్