AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP budget 2021: అర్చకుల వేతనాల పెంపుపై హర్షం వ్యక్తం చేసిన స్వామి స్వరూపానందేంద్ర

AP budget; ఏపీ బడ్జెట్‌లో అర్చకుల వేతనాలు పెంచడంపై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి హర్షం వ్యక్తం చేశారు. అర్చకుల వేతనాల కోసం రూ. 120 కోట్లు కేటాయించడం అభినందనీయమని అన్నారు. 

AP budget 2021: అర్చకుల వేతనాల పెంపుపై హర్షం వ్యక్తం చేసిన స్వామి స్వరూపానందేంద్ర
Sri Swaroopanandendra Saras
Sanjay Kasula
|

Updated on: May 20, 2021 | 2:14 PM

Share

ఏపీ బడ్జెట్‌లో అర్చకుల వేతనాలు పెంచడంపై విశాఖ విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర హర్షం వ్యక్తం చేశారు. అర్చకుల వేతనాల కోసం రూ. 120 కోట్లు కేటాయించడం అభినందనీయమని అన్నారు. దశాబ్దాలుగా అర్చకుల వేతనాల గురించి పాలకులు పట్టించుకోలేదని చెప్పారు. జీతాలను పెంచి అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం జగన్ అభినందనీయుడని పేర్కొన్నారు. రిషికేశ్ లో ఉన్న తాము ఈ వార్త విని ఆనందించినట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డికి రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉంటాయని స్వరూపానందేంద్ర పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే జగన్ పాదయాత్ర వేళ అర్చకుల జీతాలు పెంచుతాను అని హామీ ఇచ్చారు. ఆయన తన హామీని నిలబెట్టుకోవడం పట్ల అర్చక సంఘాలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,29,779.27 కోట్లతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. శాసన మండలిలో హోం మంత్రి మేకతోటి సుచరిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తొలిసారి జెండర్ బేస్డ్ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మహిళలు, చిన్నారులకు బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించింది. రూ.47,283 కోట్లతో జెండర్‌ బడ్జెట్‌ తెచ్చింది. ఇందులో బ్రాహ్మణ సంక్షేమానికి రూ.359 కోట్లు కేటాయించారు.

 ఇవి కూడా చదవండి:  Alcohol: మందు బాబులూ.. మ‌ద్యం మంచికేన‌నే భ్ర‌మ‌లో ఉన్నారా.? ఓ సారి ఈ వార్త చూడండి.. మెద‌డు దిమ్మ దిరుగుతుంది.

Private Hospitals : హాస్పిటల్స్ అక్రమాలపై ఫిర్యాదు చేయడానికి సంప్రదించాల్సిన నోడల్ అధికారుల వివరాలు, ఫోన్ నెంబర్లు