AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైవే మీద యాక్సిడెంట్‌.. ప్రమాదం జరిగిన వ్యాన్‌లో కనిపించింది చూసి పోలీసులు షాక్..!

ఒంగోలు జిల్లాలో ఓ ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. హైవేపై యాక్సిడెంట్‌ జరిగిందన్న సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్‌ను హాస్పిట్‌లు తరలించగా..ప్రమాదానికి గురైన వాహనాన్ని స్టేషన్‌ తీసుకెళ్లారు. అయితే అసలు ఈ వాహనంలో ఏముందని తెరిచి చూసిన పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇంతకు ఆ పోలీసులు ఆ వాహనంలో ఏం చేశారో తెలుసుకుందాం పదండి..

హైవే మీద యాక్సిడెంట్‌.. ప్రమాదం జరిగిన వ్యాన్‌లో కనిపించింది చూసి పోలీసులు షాక్..!
Ongole Accident
Fairoz Baig
| Edited By: |

Updated on: Jun 27, 2025 | 7:40 PM

Share

విజయవాడ నుంచి నెల్లూరు వైపుగా వెళ్తున్న ఓ బొలెరో ట్రాన్స్‌పోర్ట్‌ వాహనం.. ఒంగోలు సమీపంలో హైవేపైకి రాగానే ఎదురుగా వెళుతున్న ఓ లారీనీ ఓవర్‌ టేక్‌ చేయబోయి మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో ట్రాన్స్‌పోర్ట్‌ వాహనం ముందుభాగం మొత్తం ధ్వంసం అయింది. బొలెరో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో దెబ్బతిన్న వాహనాన్ని ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తర్వాత ఈ విషయాన్ని స్థానిక సిఐ విజయ్‌కృష్ణకు తెలిపారు.

అయితే ఘటననై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసలు ఇంతకు ఆ బొలెరో వాహనంలో ఏం తరలిస్తున్నారని ఓపెన్‌ చేసి చూశారు.. అంతే ఒక్కసారిగా పోలీసుల కళ్ళు బైర్లు కమ్మాయి.. వాహనంలో బాక్సుల నిండా, విలువైన బంగారు నగలు మిళ మిళ మెరుస్తూ కనిపించాయి. దీంతో బిత్తరపోయిన పోలీసులు ప్రకాశంజిల్లా ఎస్‌పి దామోదర్‌కు సమాచారం అందించారు. దీంతో వాహన వివరాలను తెలసుకోవాలని ఎస్‌పి పోలీస్ అధికారులకు ఆదేశించారు. ఎస్‌పి దామోదర్‌ ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన అధికారులు.. ఆ బొలేరో వాహనం ఇతర ప్రాంతాల్లోని వివిధ బంగారు నగల దుకాణాల్లో నుంచి ఆర్డర్స్‌ తీసుకొని ఆయా షాపులకు బంగారు నగలను సరఫరా చేసే సీక్వెల్‌ గ్లోబల్‌ ప్రెసీయస్‌ లాజిస్టిక్‌ కంపెనీకి చెందినది గుర్తించారు. దీంతో వాహన పత్రాలతో పాటు బంగారు నగలకు సంబంధించిన జిఎస్‌టి, ఇతర పన్నులను పత్రాలను పరిశీలన కోసం పంపించారు.

Gold 2

 

ఒంగోలు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన వాహనంలో రూ.10 కోట్ల విలువైన బంగారం బయటపడిందని తెలియగానే ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ బంగారం ఎవరిది, ఎలా తరలిస్తున్నారన్న దానిపై ఆశక్తి నెలకొంది. అయితే ఈ బంగారం అంతా లీగల్‌గానే తరలిస్తున్నారని తెలుసుకున్న పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. అయినా బంగారం విలువ కోట్లలో ఉన్నందున జిఎస్‌టి పత్రాలు, ఇతర అనుమతి పత్రాలు సరిగా ఉన్నాయా… లేదా అని చెక్‌ చేశారు. అన్నీ సక్రమంగా ఉన్నాయని తేలితే బంగారు నగలను సంబంధిత వ్యక్తులకు అందిస్తామని ప్రకాశంజిల్లా ఎస్‌పి దామోదర్‌ తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..