Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: రూ. 100 కోసం కక్కుర్తిపడ్డాడు.. కట్ చేస్తే.. సీన్ చిరిగి సితారయ్యింది.!

దొంగలు స్టైల్ మార్చేశారు. క్రియేటివిటీకి పదునుపెట్టి.. అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఇటీవల అనంతపురంలో చోటు చేసుకుంది. గుత్తిలో ఓ రైతును టార్గెట్‌ చేసి.. సినీ ఫక్కీలో ఏకంగా రూ. 1.60 లక్షలు ఎత్తుకెళ్లారు.

AP News: రూ. 100 కోసం కక్కుర్తిపడ్డాడు.. కట్ చేస్తే.. సీన్ చిరిగి సితారయ్యింది.!
Representative Image
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 30, 2023 | 12:39 PM

దొంగలు స్టైల్ మార్చేశారు. క్రియేటివిటీకి పదునుపెట్టి.. అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఇటీవల అనంతపురంలో చోటు చేసుకుంది. గుత్తిలో ఓ రైతును టార్గెట్‌ చేసి.. సినీ ఫక్కీలో ఏకంగా రూ. 1.60 లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన గుత్తి బస్టాండ్ సమీపంలోని ఓ ఎరువుల షాప్ దగ్గర జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం మాలిళ్లపల్లి గ్రామానికి చెందిన నాగేశ్వరరావు అనే రైతు తన అవసరాల కోసం బంగారు నగలను స్థానిక బ్యాంక్‌లో తనఖా పెట్టి.. రూ. 1.60 లక్షలు తీసుకున్నాడు. ఈ మొత్తాన్ని ఓ బ్యాగ్‌లో ఉంచి.. తన బైక్‌కి తగిలించాడు. దీన్నంటిని బ్యాంక్ సమీపం నుంచి రెక్కీ నిర్వహించారు గుర్తుతెలియని దుండగులు. డబ్బులు తీసుకుని ఇంటికి బయల్దేరిన రైతును ఫాలో అయ్యారు. కొద్దిదూరం వెళ్లాక ఓ ఎరువుల షాప్ దగ్గర ఆగాడు సదరు రైతు.

ఇక అక్కడికి రెండు బైకులపై వచ్చిన ఇద్దరు దుండగులు.. రైతు బైక్ వద్ద రూ. 100 పడేసి.. ఆ రైతుకు డబ్బులు పడిపోయాయని చెప్పి.. అతడి దృష్టి మళ్లించారు. రైతు ఆ రూ. 100 తీసుకునే క్రమంలో.. దుండగులు అతడి బైక్‌కి ఉన్న రూ. 1.60 లక్షల బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు. పాపం రైతు.! తిరిగి చూసుకునేలోపే.. అక్కడి నుంచి పారిపోయారు. దీంతో తాను మోసపోయాయని గ్రహించిన రైతు ఇక చేసేదేమి లేక పోలీసులను ఆశ్రయించాడు. అతడిచ్చిన కంప్లయింట్ ప్రకారం.. కేసు నమోదు చేసిన ఖాకీలు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.