AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: కృష్ణా జిల్లాలో ఘోరాతి ఘోరం.. కంటనీరు తెప్పిస్తున్న ఘటన.. సరిగ్గా ఏడాది కూడా నిండని చిన్నారిని..

Crime News: ‘మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడూ..’ అంటూ ప్రముఖ కవి, రచయిత అందేశ్రీ రాసినట్లుగా..

Crime News: కృష్ణా జిల్లాలో ఘోరాతి ఘోరం.. కంటనీరు తెప్పిస్తున్న ఘటన.. సరిగ్గా ఏడాది కూడా నిండని చిన్నారిని..
Shiva Prajapati
|

Updated on: Jan 16, 2021 | 3:50 PM

Share

Crime News: ‘మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడూ..’ అంటూ ప్రముఖ కవి, రచయిత అందేశ్రీ రాసినట్లుగా మనుషుల్లో నానాటికి మానవత్వ నశించి.. క్రూరత్వం పెరిగిపోతోంది. దీనికి మచ్చుతునకగా కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలోని కొరగుంటపాంలో ఇవాళ ఘోరాతి ఘోరమైన ఘటన వెలుగు చూసింది. గుర్తు తెలియని దుండగులు సంవత్సరం కూడా నిండని చిన్నారిని.. అత్యంత కిరాతకంగా తొడ కండరాలను కత్తితో కోశారు. ఆపై నడిరోడ్డు మీద పడేసి వెళ్లిపోయారు. తీవ్ర రక్తస్రావంతో రోడ్డుపై కొట్టుమిట్టాడుతున్న చిన్నారిని గమనించినస్థానికులు హుటాహుటిన గుడివాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.

ఆపై పోలీసులకు సమాచారం అందించారు. చిన్నారికి చికిత్స అందించిన వైద్యులు.. తొడ మీద 20 కుట్లు పడగా.. చేతికి, తలకు గాయాలైనట్లు తెలిపారు. తీవ్ర గాయాల వల్ల పాపకు మూర్చ వస్తోందని తెలిపిన వైద్యులు.. మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. పసిపాపపై ఇంతటి దాష్టికానికి పాల్పడిన దుండగులు ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. కిడ్నాపర్లు ఈ చర్యలకు పాల్పడ్డారా? లేక ఆడపిల్ల అనే కారణంతో తల్లిదండ్రులే ఇలా రోడ్డుపై పడేశారా? అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలాఉంటే.. చిన్నారి దుస్థితికి చలించిపోయిన స్థానికులు కంటనీరు పెట్టారు. దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Also read:

Andhra Pradesh Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు.. తాజాగా ఎన్ని కేసులు నమోదు అయ్యాయంటే..

కోడి పందేలలోనూ సై అంటోన్న మహిళామణులు, పుంజులతో బరిలోకి దిగిన తూర్పుగోదావరి జిల్లా ఆడపడుచులు