Tirupati Tension: చంద్రబాబు రోడ్‌ షోలో రాళ్ల దాడి.. మహిళతో సహా ఇద్దరికి గాయాలు.. రోడ్డుపై బైఠాయించి బాబు నిరసన

Tirupati By Election: తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా టీడీపీ అధినేత రోడ్‌షోలో కలకలం రేగింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు సభలో రాళ్ల దాడి జరిగింది.

Tirupati Tension: చంద్రబాబు రోడ్‌ షోలో రాళ్ల దాడి.. మహిళతో సహా ఇద్దరికి గాయాలు.. రోడ్డుపై బైఠాయించి బాబు నిరసన
Follow us

| Edited By: Team Veegam

Updated on: Apr 12, 2021 | 9:35 PM

Chandrababu Naidu: తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా టీడీపీ అధినేత రోడ్‌షోలో కలకలం రేగింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు సభలో రాళ్ల దాడి జరిగింది. తిరుపతి గాంధీ రోడ్డులో చంద్రబాబు ప్రచార సభ నిర్వహించారు. చంద్రబాబు ప్రసంగిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆయన వాహనంపై రాయి విసిరారు. ఈ ఘటనలో ఓ మహిళతో పాటు ఓ యువకుడికి గాయాలయ్యాయి. దీంతో చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు.

తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గాంధీ రోడ్డులో రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఇంతలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరారరని చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు టీడీపీ కార్యకర్తలు. దీనిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే ముందుకు రండి తేల్చుంకుందాం అన్నారు. తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా.. ఇక్కడే ఉంటా.. నేనేంటో చూపిస్తానంటూ ఆయన హెచ్చరించారు. రౌడీయిజం నశించాలంటూ నినాదాలు చేశారు చంద్రబాబు. తన ర్యాలీపై రాయి విసరడాన్ని సీరియస్‌గా తీసుకున్నారు చంద్రబాబు నాయుడు. అక్కడే బైఠాయించారు. రాయి విసిరింది ఎవరో తేలాలని డిమాండ్ చేశారు. పోలీసులు సర్ది చెప్పారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు ఎస్పీ ఆఫీసుకు వెళ్లారు చంద్రబాబు.

అనంతరం గాయపడిన వారితో చంద్రబాబు మాట్లాడారు. ఇది పిరికిపంద చర్య అని.. పోలీసుల వైఫల్యమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు రక్షణ లేకపోతే ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న తనకు రక్షణ కల్పించలేరా అని చంద్రబాబు మండిపడ్డారు. ఇక రాయి దాడి ఘటనతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులతో టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

Read Also…  Sushil Chandra: దేశ నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా సుశీల్‌ చంద్ర.. రేపు బాధ్యతలు చేపట్టనున్న సీఈసీ

తిరుమలలోనే అంజనీపుత్రుడు హనుమంతుడు జన్మించాడా? మరి దేశంలోని మిగతా ప్రజల విశ్వాసమేమిటి..?

66 ఏళ్ల వయసులో కూడా ఏంటీ ఎనర్జీ. ఏంటీ గ్రేస్.. నెట్టింట వైరల్‌గా మారిన రేఖ డ్యాన్స్ వీడియో

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..