AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

80 ఏళ్ల యోగా బామ్మ..ఆసనాలు చూస్తే..అవాక్కే !

గత దశాబ్ధ కాలంగా  మన జీవన శైలిలో అనేక రకాల మార్పులు చోటు చేసుకున్నాయి. పెరిగిన జీవన వేగంతో పాటు కాలుష్యం కారణంగా ..లెక్కకు మించిన అంతుబట్టని అనారోగ్యాలతో సగటు మనిషి సతమతమవుతున్నాడు. ఆదాయాలు పెరిగినంతగా మనిషి జీవన ప్రమాణాలు పెరగటం లేదు. లెక్కకు మించిన వైద్య విధానాలు ఉన్నప్పటికీ చెప్పుకోదగ్గ ఫలితాలు కనిపించటం లేదు. మంచి ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ ఉండాలంటే..మనం తినే తిండి విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫిట్‌నెస్‌గా ఉండాలంటే..యోగా, […]

80 ఏళ్ల యోగా బామ్మ..ఆసనాలు చూస్తే..అవాక్కే !
Anil kumar poka
|

Updated on: Nov 19, 2019 | 7:12 AM

Share

గత దశాబ్ధ కాలంగా  మన జీవన శైలిలో అనేక రకాల మార్పులు చోటు చేసుకున్నాయి. పెరిగిన జీవన వేగంతో పాటు కాలుష్యం కారణంగా ..లెక్కకు మించిన అంతుబట్టని అనారోగ్యాలతో సగటు మనిషి సతమతమవుతున్నాడు. ఆదాయాలు పెరిగినంతగా మనిషి జీవన ప్రమాణాలు పెరగటం లేదు. లెక్కకు మించిన వైద్య విధానాలు ఉన్నప్పటికీ చెప్పుకోదగ్గ ఫలితాలు కనిపించటం లేదు. మంచి ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ ఉండాలంటే..మనం తినే తిండి విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫిట్‌నెస్‌గా ఉండాలంటే..యోగా, జిమ్‌, వాకింగ్‌ లాంటివి చేస్తుంటారు. అయితే, ఆరోగ్యంతో పాటు మనసు ప్రశాంతంగా ఉండాలంటే..యోగా ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు. మనసు ఉల్లాసంగా ఉండాలే గానీ, వయసుతో నిమిత్తం లేకుండా ఎలాంటి పనులైనా ఈజీగా చేసుకోవచ్చు. అందుకే చాలా మంది ప్రశాంతతను కోరుకుంటారు. దానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది యోగా. తాజాగా 85 ఏళ్ల ఓ బామ్మ తన యోగాసనాలతో వావ్‌ అనిపిస్తోంది.

ఆమెకు ఆస్పత్రి అంటే తెలియదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ అవసరం రాలేదు కాబట్టి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరు గ్రామంలో నివసిస్తున్న జిగురు కనకలక్ష్మికి 85 ఏళ్లు. ఇప్పటివరకు ఆమెకు చిన్న జ్వరం కూడా రాలేదట. కనకలక్ష్మికి ఐదుగురు సంతానం. నలుగురు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. అయితే, ఎనిమిది పదుల వయసు దాటినప్పటికీ తన శరీరాన్ని హరివిల్లుల వంచేస్తూ కఠినమైన యోగాసనాలను అవలీలగా వేస్తుంది. తన ఆరోగ్య రహస్యం..ప్రతినిత్యమూ వ్యాయామము, యోగా అని గర్వంగా చెబుతుంది. మనిషి జీవితంలో సమస్యలు అందరికీ వస్తాయని, శ్రమపడితేనే రోగాలు దరిచేరవని అంటున్న బామ్మ..గత 20 ఏళ్ల క్రితమే మాంసాహారాన్ని పూర్తిగా వదిలేసి, కేవలం శాఖాహారం భోజనంతోనే జీవిస్తున్నానని చెబుతుంది. ఏదేమైనప్పటికీ క్రమం తప్పకుండా యోగా చేస్తానని, ఒక్కరోజు యోగా చేయకపోతే..శరీరం లేజీగా తయారవుతుందని అంటోంది. తన పనులన్నీ తానే చేసుకుంటూ..అద్భుతమైన యోగాసనాలు వేస్తున్న కనకలక్ష్మిని చూసి గ్రామస్తులు సైతం నివ్వెర పోతున్నారు. నేటి తరం యువత ఈ బామ్మను ఆదర్శంగా తీసుకుని ఆరోగ్యంగా జీవించాలని స్థానికులు సూచిస్తున్నారు.